News February 12, 2025
HYDలో ఉరేసుకున్న తూ.గో యువకుడు

ఉప్పలగుప్తంకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కొర్లపాటి శేషురావు (39) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్యనగర్ కాలనీలో ఈ ఘటన మంగళవారం జరిగింది. అద్దెకుంటున్న ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశారు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని చెబుతున్నారు. శేషురావు మృతదేహాన్ని ఉప్పలగుప్తం తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.
Similar News
News November 6, 2025
పున్నమి వెలుగుల్లో ధర్మపురి బ్రహ్మపుష్కరిణి

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలోని బ్రహ్మపుష్కరిణి(కోనేరు) కార్తీక పౌర్ణమి వెలుగుల్లో కళకళలాడింది. పున్నమి చంద్రుడి కాంతులు నిర్మల జలాలపై ప్రతిబింబించి దివ్య రూపాన్ని సాక్షాత్కరించింది. కార్తీక పౌర్ణమి కావడంతో చంద్రుడు మరింత ప్రకాశవంతంగా వెలిగి భక్తుల మనసులను ఆకట్టుకున్నాడు. దీపాల కాంతులు, చంద్రుని తేజస్సుల కలయికగా కోనేరు పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి.
News November 6, 2025
దోమకొండలో రేపు జిల్లా విలువిద్య పోటీలు

దోమకొండలోని గడి కోటలో శుక్రవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా విలువిద్య పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విలువిద్య అసోసియేషన్ అధ్యక్షుడు తిరుమల గౌడ్ తెలిపారు. పోటీలలో పాల్గొనే క్రీడాకారులు ఉదయం 8 గంటల వరకు గండికోటలోకి రావాలని సూచించారు. ముందుగా పేరు నమోదు చేసుకున్న వారికి పోటీలలో పాల్గొనే అవకాశం కల్పిస్తామన్నారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News November 6, 2025
యాదాద్రి: తెగిపడిన విద్యుత్ వైర్లు.. వృద్ధుడు, గేదె మృతి

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గేదెల కాపరి గొర్ల మల్లయ్య(55) రోజూ మాదిరిగానే తన గేదెలను మేపడానికి వెళ్లారు. అక్కడ ఓ వ్యవసాయ భూమిలో తెగి నేలపై పడిన కరెంటు వైర్లను గమనించకుండా, మేస్తున్న తన గేదెను పక్కకు కొట్టే ప్రయత్నంలో మల్లయ్యకు షాక్ తగిలింది. ఈ ఘటనలో మల్లయ్య, ఆయన గేదె అక్కడికక్కడే మృతి చెందారు.


