News February 12, 2025
HYDలో ఉరేసుకున్న తూ.గో యువకుడు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739368089688_1152-normal-WIFI.webp)
ఉప్పలగుప్తంకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కొర్లపాటి శేషురావు (39) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్యనగర్ కాలనీలో ఈ ఘటన మంగళవారం జరిగింది. అద్దెకుంటున్న ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశారు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని చెబుతున్నారు. శేషురావు మృతదేహాన్ని ఉప్పలగుప్తం తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.
Similar News
News February 12, 2025
రామగుండం: వారం వ్యవధిలో తనువు చాలించిన భార్యాభర్తలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739377934377_50226861-normal-WIFI.webp)
తనువు ఆ తర్వాత మనువు తో కలిసిన ఆ బంధం కట్టే కాలే వరకు కొనసాగింది. 4 రోజుల వ్యవధిలోనే భార్యాభర్తలు తనువు చాలించిన సంఘటన గోదావరిఖనిలో చోటుచేసుకుంది. స్థానిక బాపూజీ నగర్కు చెందిన ఆకునూరి లక్ష్మి ఈనెల 2న మరణించగా 4 రోజుల వ్యవధిలో భర్త ఆకునూరి దుర్గయ్య తనువు చాలించారు. దీంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సంఘటన కుటుంబం లో విషాదాన్ని మిగిల్చింది.
News February 12, 2025
మన్యంకొండకు పోటెత్తిన భక్త జనం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739368513711_60392612-normal-WIFI.webp)
పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఉమ్మడి జిల్లానుంచే కాక పక్క రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అర్ధరాత్రి జరిగే (తెరు) రథోత్సవాన్ని వీక్షించడానికి భక్తజనం ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, కాలినడకన కదలి రావడం జరిగింది. గోవిందా.. హరి.. గోవిందా అంటూ గోవిందా నామాలతో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు.
News February 12, 2025
ఎల్లారెడ్డి: ప్రణాళికతో చదివితే ఉత్తీర్ణత సాధించవచ్చు: DEO
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739355938562_50226745-normal-WIFI.webp)
ప్రతి విద్యార్థి ప్రణాళికతో చదివితే పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించవచ్చునని జిల్లా విద్యాశాఖ అధికారి రాజు సూచించారు. ఎల్లారెడ్డి పట్టణంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలను బుధవారం ఆయన సందర్శించారు. పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు సాధించాలని సూచించారు. విద్యార్థి జీవితంలో 10వ తరగతి తొలి మెట్టుగా భావించాలన్నారు.