News January 10, 2026
HYDలో కరీంనగర్ యువకుడి ఆత్మహత్య

ఆర్థిక సమస్యలు తాళలేక ఓ యువ ఆర్కిటెక్ట్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కరీంనగర్కు చెందిన అనుదీప్ ఓ ప్రైవేట్ సంస్థలో ఆర్కిటెక్ట్గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నట్లు లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
Similar News
News February 18, 2026
టెన్త్ పరీక్షల గ్యాప్లోనూ క్లాసులు!

TG: టెన్త్ పరీక్షల మధ్య గ్యాప్లో విద్యార్థులకు క్లాసులు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఎగ్జామ్స్ మధ్య 3-5 రోజుల వ్యవధి ఉండటంతో సూడెంట్లు స్కూలుకు రావాలని ఆదేశించారు. ఆయా రోజుల్లో 3 పీరియడ్ల చొప్పున క్లాసులు తీసుకోనున్నారు. మార్చి 14 నుంచి పరీక్షలు జరగనుండగా, విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఎక్కువ గ్యాప్ ఉండేలా షెడ్యూల్ రూపొందించారు. ఆ గ్యాప్లో ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు.
News February 18, 2026
మంగళగిరి-తెనాలి రోడ్డు విస్తరణ

మంగళగిరి-తెనాలి రోడ్డును రూ.16.93 కోట్లతో 60 అడుగులకు విస్తరించనున్నారు. మంత్రి లోకేశ్ ఆదేశాలతో ఖబరస్థాన్కు ఇబ్బంది లేకుండా ‘కాంటిలివర్’ పద్ధతిలో నిర్మాణం చేపట్టనున్నారు. ఈ పనుల్లో 105 కట్టడాలు (28 పూర్తిగా, 77 పాక్షికంగా) ప్రభావితమవుతాయి. నిర్వాసితులకు రూ.12.5 కోట్ల పరిహారం, రూ.40 కోట్ల విలువైన TDR బాండ్లు (1:4 నిష్పత్తిలో) ఇవ్వనున్నారు. వీటిని బహిరంగ మార్కెట్లో అమ్ముకునే వెసులుబాటు కల్పించారు.
News February 18, 2026
పాడేరు: ‘పింఛన్ పంపిణీలో అవకతవకలు జరిగితే కఠిన చర్యలు’

పింఛన్ పంపిణీలో అలసత్వం వహించకూడదని కలెక్టర్ దినేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. పింఛన్ పంపిణీలో అవకతవకలు జరిగితే ఎంతటి అధికారికైనా సరే చర్యలు తప్పవని హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి రెండు జిల్లాల అధికారులతో వీసీ నిర్వహించారు. పింఛన్ పంపిణీలో ఐవీఆర్ఎస్ ద్వారా వచ్చే కాల్స్లో, లబ్దిదారులకు ఏ విధమైన ప్రశ్నకు సంతృప్తి చెందితే సమాధానంగా ఏ బటన్ ప్రెస్ చెయ్యాలో తెలియజేయాలని సూచించారు.


