News September 17, 2025

HYDలో తొలిసారి జాతీయ జెండా ఎగిరిందిక్కడే

image

దేశవ్యాప్తంగా 1947 AUG 15 నుంచి జాతీయ జెండాలు స్వేచ్ఛగా రెపరెపలాడుతున్న సమయంలో నిజాం ప్రభుత్వం నిరంకుశత్వంలో HYDలో ఎగరనివ్వలేదు. ఏడాది తర్వాత వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో ద్వారా 1948 SEP 17న తొలిసారిగా సికింద్రాబాద్ బొల్లారం రాష్ట్రపతి నిలయంలో జాతీయ జెండా అధికారికంగా రెపరెపలాడి హైదారబాదీల స్వాతంత్య్ర కాంక్షను నెరవేర్చింది. అప్పుడు నిర్మించిన జెండా దిమ్మెను నేటికీ ప్రదర్శనకు అలాగే ఉంచారు.

Similar News

News September 17, 2025

సంగారెడ్డి: పాఠశాలల్లో పేరెంట్-టీచర్ మీటింగ్

image

ఈ నెల 20న సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు బుధవారం ఆదేశించారు. ఈ సమావేశంలో విద్యార్థుల విద్యా ప్రగతి, పాఠశాల అభివృద్ధి, ఇతర ముఖ్యమైన అంశాలపై చర్చించాలని ఆయన సూచించారు. పీటీఎంకు సంబంధించిన వివరాలను మొబైల్ యాప్‌లో నమోదు చేయాలని ప్రధానోపాధ్యాయులకు తెలిపారు.

News September 17, 2025

స్మార్ట్‌ కార్డుల్లో పేరు సరిదిద్దాం: జేసీ

image

అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పేరును స్మార్ట్‌ కార్డుల్లో చేర్చినట్లు జాయింట్ కలెక్టర్ టి. నిశాంతి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం తక్షణమే స్పందించిందని చెప్పారు. ఇకపై ఏ ఒక్క కార్డును స్కాన్ చేసినా, ‘అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా’ అని కనిపిస్తుందని ఆమె స్పష్టం చేశారు. అంబేడ్కర్‌ అభిమానుల మనోభావాలను గౌరవించామని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.

News September 17, 2025

PM AI వీడియో తొలగించండి: పట్నా హైకోర్టు

image

ప్రధాని మోదీని ఆయన తల్లి మందలిస్తున్నట్టు రూపొందించిన <<17688399>>AI వీడియోను<<>> సోషల్ మీడియా నుంచి తొలగించాలని బిహార్‌లోని పట్నా హైకోర్టు కాంగ్రెస్ పార్టీని ఆదేశించింది. SEP 10న బిహార్ కాంగ్రెస్ మోదీపై AI వీడియో క్రియేట్ చేసి Xలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీన్ని బీజేపీ, NDA మిత్ర పక్షాలు తీవ్రంగా ఖండించాయి. దీనిపై బీజేపీ ఢిల్లీ ఎలక్షన్ సెల్ వేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు వీడియో తొలగించాలని ఆదేశించింది.