News February 17, 2025

HYDలో నెహ్రూ జూ పార్క్ వద్ద అధిక కాలుష్యం..!

image

HYD నగరం పరిధిలో నెహ్రూ జూపార్క్ ప్రాంతం అత్యంత కాలుష్యమైన ప్రాంతమని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలిపింది. 40 రోజుల సగటు వాయు నాణ్యత 150గా నమోదైందని పేర్కొంది. జనవరి 20వ తేదీన అత్యధికంగా 200 నమోదైందని వెల్లడించింది. అతి సూక్ష్మ ధూళి కణాలు అధిక మోతాదులో విడుదవుతున్నట్లు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలిపింది.

Similar News

News September 18, 2025

సిరిసిల్ల జిల్లాలో వర్షపాతం నమోదిలా..

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు వర్షపాత నమోదు వివరాలు ఇలా ఉన్నాయి. రుద్రంగి 2.3, చందుర్తి 13.8, వేములవాడ రూరల్ 22.2, బోయిన్పల్లి 14.9, వేములవాడ 16.6, సిరిసిల్ల 23.0, కొనరావుపేట 15.7, వీర్నపల్లి 11.0, ఎల్లారెడ్డిపేట 1.4, గంభీరావుపేట 26.9, ముస్తాబాద్ 5.4, తంగళ్లపల్లి 5.6, ఇల్లంతకుంటలో 11.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News September 18, 2025

మల్యాల: ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాలువలో వృద్ధురాలి శవం

image

ఎస్సారెస్పీ కాలువలో కొట్టుకువచ్చిన ఓ వృద్ధురాలి శవాన్ని మల్యాల మండలం నూకపల్లి బ్రిడ్జి వద్ద స్థానికులు గమనించారు. శవం మరింత ముందుకు కొట్టుకుపోకుండా తాళ్లతో కట్టి ఉంచారు. ఆమె నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ గ్రామానికి చెందిన ప్రభావతిగా గుర్తించారు. ఆమెకు మతిస్థిమితం లేదని కుటుంబసభ్యులు తెలిపారు. సమాచారమందుకున్న పోలీసులకు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 18, 2025

అఫ్జల్‌సాగర్‌లో గల్లంతు.. భీమలింగం బ్రిడ్జిపై లభ్యం

image

వలిగొండ (మం) సంగం భీమలింగం బ్రిడ్జిపై గుర్తుతెలియని మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. అఫ్జల్‌సాగర్ నాలాలో 4రోజుల క్రితం గల్లంతైన అర్జున్ మృతదేహంగా అధికారులు గుర్తించారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన ఘటనా స్థలానికి బయలుదేరారు.