News August 30, 2025
HYDలో ఫంక్షన్ కోసం పేదోడి టెన్షన్!

ఇంట్లో ఫంక్షన్ ఉంటే HYDలో పేదోడు ఓ ఫంక్షన్ చేయాలంటే కొండంత భారంగా మారింది. ఇందుకోసం అప్పు మీద అప్పు చేయాల్సిన పరిస్థితి. HYDలో ఒక ఫంక్షన్ కోసం రూ.లక్షల్లో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. వివిధ ప్రాంతాల నుంచి బతుకుదెరువుకు వలస వచ్చిన ఎంతో మంది ఈ ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. HYDలో ప్రభుత్వం ప్రతి డివిజన్లో కనీసం 2 ఫంక్షన్ హాల్స్ నిర్మించి, తక్కువ ధరకు ఉంచేలా చూడాలని కోరుతున్నారు.
Similar News
News August 31, 2025
సిద్దిపేట జిల్లాలో ‘డెంగ్యూ’ భయం

సిద్దిపేట జిల్లాలో డెంగ్యూ కేసులు నమోదు కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. డెంగ్యూ జ్వరంతో జగదేవ్పూర్ మండలం తిమ్మాపూర్, అనంతసాగర్ గ్రామాలకు చెందిన ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడంతో ప్రజల్లో మరింత ఆందోళన మొదలైంది. ఇదే నెలలో దుబ్బాకలోనూ డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. దోమకాటు ద్వారా డెంగ్యూ వ్యాపి చెందుతుండగా అధికారులు స్పందించి దోమల నివారణకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
News August 31, 2025
ఈ రోజు నమాజ్ వేళలు(ఆగస్టు 31, ఆదివారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.48 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.02 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.16 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.42 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.30 గంటలకు
✒ ఇష: రాత్రి 7.44 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News August 31, 2025
జగన్ పులివెందుల పర్యటన షెడ్యూల్ ఖరారు

AP: వైసీపీ అధినేత జగన్ పులివెందులలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. SEP 1న 3PMకు పులివెందులలోని క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు. 2న 7.15AMకు ఇడుపులపాయకు వెళ్లి మాజీ సీఎం వైయస్ఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి పులివెందుల క్యాంప్ కార్యాలయం చేరుకుని ప్రజలకు అందుబాటులో ఉంటారు. రాత్రి అక్కడి నివాసంలో బస చేసి 3న 7AMకు పులివెందుల నుంచి బెంగళూరు తిరుగు పయనమవుతారు.