News April 4, 2024

HYDలో మహాలక్ష్మి ఎఫెక్ట్.. తగ్గిన బస్‌ పాస్‌లు!

image

గ్రేటర్‌ హైదరాబాద్‌లో మహాలక్ష్మి స్కీమ్‌తో బస్‌‌పాస్‌లపై ప్రభావం పడింది. 2014 తర్వాత 4.50 లక్షలు ఉన్న పాస్‌ల సంఖ్య కరోనా తర్వాత 3.9 లక్షలకు తగ్గింది. కాంగ్రెస్ ప్రభుత్వం 2023, డిసెంబర్‌ 9న FREE బస్‌ స్కీం అమల్లోకి తీసుకొచ్చింది. ఉద్యోగులు, విద్యార్థులకు కూడా ఉచితం కావడంతో పాస్‌ల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం నగరంలో 2,82,000 మంది బస్‌ పాస్‌లు వినియోగిస్తున్నట్లు TSRTC లెక్కలు చెబుతున్నాయి.

Similar News

News September 13, 2025

జూబ్లీహిల్స్ అభివృద్ధిపై కాంగ్రెస్ ఫోకస్..!

image

జూబ్లీహిల్స్ అభివృద్ధిపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. రాష్ట్ర మంత్రులు నిరంతరం ఆ నియోజకవర్గంలో పర్యటిస్తూ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. ఈరోజు ఎర్రగడ్డ డివిజన్‌లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ రూ.2.94 కోట్లతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, కాంగ్రెస్, BJP, MIM నాయకులు ఉన్నారు.

News September 13, 2025

గ్రేటర్ HYDలో సెప్టెంబర్‌లో పెరిగిన విద్యుత్ డిమాండ్

image

గ్రేటర్ హైదరాబాద్‌లో విద్యుత్ మీటర్లు గిర్రున తిరుగుతున్నాయి. ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో విద్యుత్ డిమాండ్ గతేడాదితో పోలిస్తే భారీగా పెరిగిందని TGSPDCL అధికారులు గుర్తించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో రోజుకు సుమారు 3,600 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. అధిక డిమాండ్ కారణంగా సరఫరా స్థిరంగా ఉండేందుకు అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

News September 13, 2025

HYD: మరీ ఇంత బరితెగింపా..? రేవంత్ రెడ్డి..!: RSP

image

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ గురుకులంలో విషాహారం తిని 20 మంది అమ్మాయిలు అనారోగ్యానికి గురయ్యారు. ట్రీట్‌మెంట్ చేయించకుండా మీరే నయం చేసుకోండని చేతులు దులుపుకోవడం ఏంటని BRS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి RS ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంత బరితెగింపా అని ఫైర్ అయ్యారు. ఈ అమ్మాయి ప్రస్తుతం జహీరాబాద్‌లో తన ఇంట్లో చికిత్స పొందుతోందని ఆయన Xలో ట్వీట్ చేశారు.