News October 20, 2025

HYDలో రాత్రి 8- 10 మధ్యనే క్రాకర్లు కాల్చాలి

image

సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రాత్రి 8- 10 గంటల మధ్యే క్రాకర్లు కాల్చాలని నగర పోలీసులు చెబుతున్నారు. చిన్న పిల్లలు పటాకులు కాల్చేటప్పుడు పెద్దలు దగ్గర ఉండాలని, బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే కాల్చాలని చెప్పారు. ఇసుక, నీళ్లు దగ్గర ఉంచుకోవాలన్నారు. పబ్లిక్‌ రోడ్లపై క్రాకర్లు కాల్చకూడదని హెచ్చరించారు. దీపావళి వేడుకల్లో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని తిరుమలగిరి ఇన్‌స్పెక్టర్ నాగరాజు సూచించారు.

Similar News

News October 20, 2025

MBNR: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా గ్రామీణ యువత స్వయం ఉపాధి కోసం SBI RSETY ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అందిస్తోంది. ఈ నెల 22 వరకు తేనెటీగల పెంపకంపై శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఆసక్తి గల యువకులు బండమీదిపల్లిలోని RSETY కేంద్రంలో లేదా 9963369361, 9542430607 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.

News October 20, 2025

‘K-Ramp’ రెండో రోజు కలెక్షన్స్ ఎంతంటే?

image

కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా జైన్స్ నాని తెరకెక్కించిన ‘K-Ramp’ మూవీ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. శనివారం ఇండియాలో దాదాపు రూ.2.25 కోట్లు(నెట్) వసూలు చేసిన ఈ మూవీ ఆదివారం రూ.2.85 కోట్ల వరకు రాబట్టినట్లు Sacnilk ట్రేడ్ వెబ్‌సైట్ తెలిపింది. మొత్తంగా రెండు రోజుల్లో రూ.5.1 కోట్లు వచ్చినట్లు పేర్కొంది. ఇవాళ హాలిడే నేపథ్యంలో కలెక్షన్స్ పెరిగే అవకాశమున్నట్లు అంచనా వేసింది.

News October 20, 2025

ఎస్పీ రోహిత్ రాజు దీపావళి విషెస్

image

జిల్లా ప్రజలు, పోలీస్ అధికారులు, సిబ్బందికి ఎస్పీ రోహిత్ రాజు దీపావళి పండుగ శుభాకాంక్షలు చెప్పారు. ఈ దీపావళి పండుగ ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఎస్పీ ఆకాంక్షించారు. టపాసులు కాల్చే సమయంలో తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. వెలుగుల మధ్య ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలని కోరారు.