News March 20, 2026
HYDలో రేపటి నుంచి బంద్!

రంజాన్ మాసం సందర్భంగా పాతబస్తీలో నెల రోజులుగా సందడిగా సాగుతున్న నైట్ బజార్ రేపటితో ముగియనుంది. చార్మినార్, లాడ్ బజార్ ప్రాంతాలు రాత్రివేళల్లో కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. రేపు రంజాన్ కావడంతో ఈ ప్రత్యేక నైట్ షాపింగ్కు తెరపడనుంది. తెల్లవారుజాము వరకు నడిచిన వ్యాపారాలు రేపటి నుంచి మిడ్నైట్ వరకే కొనసాగుతాయి. మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో సాయంత్రం నుంచే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Similar News
News March 27, 2026
హైదరాబాద్: రూ. 217 కోట్ల భారీ జీఎస్టీ స్కామ్

తెలుగు రాష్ట్రాల్లో రూ. 217 కోట్ల జీఎస్టీ కుంభకోణాన్ని డీజీజీఐ (DGGI) అధికారులు ఛేదించారు. 72 షెల్ కంపెనీల ద్వారా ఎలాంటి వస్తు సరఫరా లేకుండానే రూ. 1,472 కోట్ల నకిలీ లావాదేవీలు సృష్టించినట్లు గుర్తించారు. తప్పుడు పత్రాలతో ప్రభుత్వానికి పన్ను ఎగ్గొట్టి, అక్రమంగా ఐటీసీ (ITC) క్లెయిమ్ చేశారు. హైదరాబాద్, ఏపీల్లో జరిపిన దాడుల్లో కీలక సాక్ష్యాధారాలు, డిజిటల్ డేటాను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
News March 27, 2026
హైదరాబాద్: రూ. 217 కోట్ల భారీ జీఎస్టీ స్కామ్

తెలుగు రాష్ట్రాల్లో రూ. 217 కోట్ల జీఎస్టీ కుంభకోణాన్ని డీజీజీఐ (DGGI) అధికారులు ఛేదించారు. 72 షెల్ కంపెనీల ద్వారా ఎలాంటి వస్తు సరఫరా లేకుండానే రూ. 1,472 కోట్ల నకిలీ లావాదేవీలు సృష్టించినట్లు గుర్తించారు. తప్పుడు పత్రాలతో ప్రభుత్వానికి పన్ను ఎగ్గొట్టి, అక్రమంగా ఐటీసీ (ITC) క్లెయిమ్ చేశారు. హైదరాబాద్, ఏపీల్లో జరిపిన దాడుల్లో కీలక సాక్ష్యాధారాలు, డిజిటల్ డేటాను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
News March 27, 2026
మన్యంకొండలో వైభవంగా సీతారాముల కళ్యాణం

మహబూబ్నగర్ జిల్లా మన్యంకొండ లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య నిర్వహించిన ఈ దివ్య ఘట్టాన్ని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారు. రేపు ఆలయంలో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం జరగనుంది.


