News December 20, 2024
HYDలో హంతకుడికి మరణ శిక్ష

నాంపల్లి కోర్టు సంచలన తీర్పునిచ్చింది. పోలీసుల వివరాలు.. భార్యాభర్తల మధ్య విబేధాలు రావడంతో ఆర్తి 2వ పెళ్లి చేసుకుంది. కోపం పెంచుకున్న సాయి(మాజీ భర్త) 2022లో నారాయణగూడలో 2వ భర్త నాగరాజు, ఆర్తి(గర్భిణి), విష్ణు(కుమారుడు)పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. గర్భిణితో పాటు తండ్రి, కుమారుడు చికిత్స పొందుతూ చనిపోయారు. ఈకేసులో నిందితుడు సాయికి మరణ శిక్ష, సహకరించిన రాహుల్కు యావజ్జీవ కారగార శిక్ష పడింది.
Similar News
News November 5, 2025
కూతురితో కలిసి హుస్సేన్సాగర్లో దూకి సూసైడ్

హుస్సేన్సాగర్లో దూకి తల్లీబిడ్డ తనువు చలించారు. లేక్ పోలీసుల వివరాలు.. CA కీర్తిక అగర్వాల్(28), ఆమె పాప కనిపించడం లేదని బహదూర్పురా PSలో మిస్సింగ్ కేసు నమోదైంది. NOV 2న హుస్సేన్సాగర్లో ఓ యువతి మృతదేహం లభ్యం అవగా విచారించిన పోలీసులు చనిపోయింది కీర్తిక అని గుర్తించారు. భర్తతో విభేదాల కారణంగా సూసైడ్ చేసుకున్నట్లు నిర్ధారించారు. పాప మృతదేహాన్ని వెలికితీసి దర్యాప్తు చేపట్టారు.
News November 5, 2025
HYD: 19 మంది చనిపోయినా గుంత పూడ్చలే?

చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో 19 మంది ప్రాణాలు పోవడానికి కారణమైన గుంతను పూడ్చే విషయంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. యాక్సిడెంట్ నేపథ్యంలో ఈ గుంతను మంగళవారం ఉదయం డస్ట్తో పూడ్చారు. సాయంత్రం డస్ట్ అంతా కొట్టుకుపోయి మళ్లీ గుంత యథాస్థితికి వచ్చింది. రాత్రి సమయంలో ఈ గుంత ప్రమాదకరంగా కనిపించింది. ఇంత ఘోరం జరిగినా అధికార యంత్రాంగంలో చలనం లేకపోవడం గమనార్హం.
News November 5, 2025
HYD: డ్రంక్ & డ్రైవ్లో దొరికి PS ముందే సూసైడ్

మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో డ్రైవర్ సూసైడ్ కలకలం రేపింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ ఒక వ్యక్తి కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుటే ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు దమ్మాయిగూడకు చెందిన మీన్ రెడ్డిగా గుర్తించారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


