News February 1, 2025

HYDలో హృదయవిదారక ఘటన

image

HYDలోని వారాసిగూడ PSపరిధిలో <<15323241>>ఇంట్లో తల్లి మృతదేహంతో<<>> ఇద్దరు కూతుర్లు ఉన్న విషయం తెలిసిందే. అయితే బౌద్ధనగర్‌లోని ఓ ఇంట్లో నివాసముంటూ తల్లి ఇద్దరు కూతుర్లను చూసుకుంటోంది. తండ్రి ఆ కుటుంబాన్ని వదిలి వెళ్లిపోగా.. గత కొద్దిరోజులుగా తల్లి లలిత అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందింది. దహన సంస్కారాలకు డబ్బులు లేకపోవడంతో 9 రోజులుగా మృతదేహాన్ని పక్కనే పెట్టుకొని ఉండిపోగా ప్రస్తుతం ఆ పిల్లలు తల్లిలేక అనాథలయ్యారు.

Similar News

News February 1, 2025

BUDGET: స్కూల్ స్టూడెంట్స్ కోసం ‘అటల్ టింకరింగ్ ల్యాబ్స్’

image

ఇన్వెస్టింగ్ ఇన్ పీపుల్ మిషన్‌పై ఎక్కువగా ఫోకస్ పెట్టామని నిర్మలా సీతారామన్ తెలిపారు. రాబోయే ఐదేళ్లలో దేశ వ్యాప్తంగా 50వేల పాఠశాలల్లో ‘అటల్ టింకరింగ్ ల్యాబ్స్’ నెలకొల్పుతామని ప్రకటించారు. ఇవి స్టూడెంట్స్‌లో ఆసక్తి, సృజన, సైంటిఫిక్ టెంపర్‌మెంట్ పెంచుతాయని తెలిపారు. డిజిటల్ లెర్నింగ్ వనరుల యాక్సెస్ కోసం అన్ని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు.

News February 1, 2025

BIG NEWS: కొత్త ఆదాయ పన్ను చట్టం

image

ఆదాయపన్ను చెల్లింపు దారులకు ఊరట లభించబోతున్నట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈసారి ట్యాక్స్ సహా ఆరు సంస్కరణలు చేపట్టబోతున్నట్లు చెప్పిన మంత్రి దీన్ని ఉటంకిస్తూ ప్రకటన చేశారు. మార్పులతో కూడిన ఐటీ బిల్లును వచ్చే వారం లోక్‌సభలో ప్రవేశపెడతామన్నారు.

News February 1, 2025

వికారాబాద్: అడవిలో ఉద్దేశపూర్వకంగా నిప్పు పెడితే చర్యలు

image

అటవీ ప్రాంతంలో ఉద్దేశపూర్వకంగా ఎవరైనా నిప్పు పెడితే కఠిన చర్యలు తప్పవని అటవీ శాఖ రేంజర్ అధికారి రాజేందర్ హెచ్చరించారు.శుక్రవారం అర్ధరాత్రి యాలాల్ మండలం రాస్నం-అంపల్లి మార్గంలో గల అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. సెక్షన్ అధికారి కనకరాజు తన సిబ్బందితో వెళ్లి మంటలు ఆర్పారు. అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగితే అటవీ భూములు సాగు చేస్తున్న రైతులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.