News May 8, 2024

HYD‌లో 11 మందిని బలితీసుకొన్న గాలివాన

image

HYDలో నిన్న కురిసిన గాలివాన 11 మందిని బలితీసుకొంది. బహదూర్‌పురాలో కరెంట్ పోల్ తగిలి షాక్‌తో ఫక్రూ(40) చనిపోయారు. బేగంపేట‌ నాలాలో రెండు మృతదేహాలు కొట్టుకొచ్చాయి. బాచుపల్లి‌‌లో గోడకూలి ఏకంగా ఏడుగురు ప్రాణాలు విడిచారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. అబ్దుల్లాపూర్‌మెట్‌లో పంక్చర్‌ షాప్‌లో ఉన్న వ్యక్తి కరెంట్‌ షాక్‌తో చనిపోయారు. అకాల వర్షానికి ఒక్కరోజే 11 మంది చనిపోవడం HYDలో ఇదే తొలిసారి.

Similar News

News September 13, 2025

HYD: పెళ్లి సంబంధాల పేరుతో రూ.25 లక్షల మోసం.. అరెస్ట్

image

పెళ్లి సంబంధాలు చూస్తామని మ్యాట్రిమోనీ వెబ్ సైట్‌లో మోసం చేసిన అనీశ్(33)ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేక్ వీడియో కాల్స్ చేయించి, మెప్పించి, చివరికి అకౌంట్‌లో నుంచి రూ.25 లక్షలు కాజేసినట్లు ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు. పోలీసులు విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకున్నారు.

News September 13, 2025

HYD: నిర్లక్ష్య రైడింగ్ ప్రాణాన్ని బలిగొంది..!

image

ఘట్‌కేసర్ పరిధి అన్నోజిగూడలో నిర్లక్ష్య రైడింగ్ ఓ ప్రాణాన్ని బలి తీసుకుంది. విధులకెళ్తున్న 57 ఏళ్ల ఎలక్ట్రీషియన్ చంద్రారెడ్డిని ఓ మైనర్ బాలుడు నిర్లక్ష్యంగా బైక్‌‌ నడిపి, ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. బైక్ నడిపిన 16 ఏళ్ల బాలుడితోపాటు, వాహన యజమాని అయిన అతడి తల్లిపై కేసు నమోదు చేశారు. మైనర్లకు వాహనాలు ఇస్తే పేరెంట్స్‌పై కేసులు నమోదు చేస్తామన్నారు.

News September 13, 2025

HYD: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై కవిత ఆగ్రహం

image

పేద విద్యార్థుల చదువులపై ప్రభుత్వానికి ఏమాత్రం పట్టింపు లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత HYDలో విమర్శించారు. రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయకపోవడంతో ఉన్నత విద్యాసంస్థలు బంద్ అయ్యే పరిస్థితి నెలకొందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 15వ తేదీ నుంచి విద్యాసంస్థలను బంద్ చేస్తున్నట్లు తెలిపారు. బకాయిలను చెల్లించాలని కవిత డిమాండ్ చేశారు.