News February 19, 2025
HYDలో 3 లక్షల మంది AI నిపుణులు: మంత్రి

ప్రపంచ నగరాలు టెక్నాలజీ అంటే HYD నగరం వైపే చూసేలా తీర్చిదిద్దుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర IT మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. HYDలో సమ్మిట్లో పాల్గొన్న మంత్రి, HYDలో 1500కు పైగా ఐటీ కంపెనీలు ఉన్నాయని, వీటిలో 15 లక్షల మందికిపైగా పనిచేస్తున్నారని తెలిపారు. వీరిలో 3 లక్షల మంది AI నిపుణులు, లక్ష మంది చిప్ డిజైనర్లు ఉన్నట్లుగా తెలిపారు.
Similar News
News July 6, 2025
ఈనెల 10 లోపు శ్రీశైలం డ్యాం గేట్ల ఎత్తివేత

ఈనెల 10 తేదీలోపు శ్రీశైలం డ్యాం రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తి నాగార్జునసాగర్కు నీటిని విడుదల చేయనున్నారు. ప్రస్తుతం శ్రీశైలానికి భారీగా వరద నీరు వచ్చి చేరటంతో డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంటుంది. రేపటి నుంచి డ్యాం ఇంజినీరింగ్ అధికారులందరూ అందుబాటులో ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఏ క్షణంలో అయినా డ్యామ్ గేట్లను తెరిచే అవకాశం ఉన్నట్లు సమాచారం.
News July 6, 2025
SKLM: వ్యాధులు పట్ల అప్రమత్తం అవసరం

పెంపుడు జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులు పట్ల అప్రమత్తతో మెలగాలని శ్రీకాకుళం జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజగోపాలరావు అన్నారు. నేడు ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని శ్రీకాకుళం వెటర్నరీ పోలీ క్లినిక్ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెంపుడు జంతువుల నుంచి ర్యాబిస్, స్వైన్ ఫ్లూ, యంత్రాక్స్, బర్డ్ ఫ్లూ వంటి వ్యాధులు సంక్రమిస్తాయన్నారు.
News July 6, 2025
రైతులకు అవగాహన కల్పించండి: కడప కలెక్టర్

కడప జిల్లాలో ఈనెల 14వ తేదీ వరకు జరిగే పశుగ్రాస వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. పశుగ్రాస వారోత్సవాల గోడపత్రికలను ఆయన కడపలో ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పశుగ్రాసాలను సాగు చేసి రైతుల ఇంట సిరుల పండించేలా చూడాలన్నారు. దీనిపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. పశుగ్రాసాల సాగు ఎంతో ఉపయోగకరమని ఆ దిశగా చర్యలు చేపట్టాలన్నారు.