News March 14, 2025

HYD: అంగన్‌వాడీలకు సెలవు లేదు

image

హోలీ సందర్భంగా ప్రభుత్వం అన్ని విద్యాసంస్థలు, కార్యాలయాలకు శుక్రవారం సెలవు ప్రకటించింది. అయితే, అంగన్‌వాడీ ఉద్యోగినులు మాత్రం దీనికి మినహాయింపు. పండుగ రోజున కూడా విధులు నిర్వర్తించాల్సి రావడం వారిలో తీవ్ర అసంతృప్తి కలిగిస్తోంది. కుటుంబంతో హోలీ జరుపుకునే అవకాశాన్ని దూరం చేయడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాన హక్కులు కల్పించాలని, ప్రభుత్వ వైఖరి మారాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Similar News

News November 18, 2025

ప్రొద్దుటూరు: భారీ మొత్తంలో జీఎస్టీ ఎగవేత

image

ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో సోమవారం CTO జ్ఞానానంద రెడ్డి ఆధ్వర్యంలో స్టేట్ ట్యాక్స్ అధికారుల బృందం సోదాలు నిర్వహించాయి. భారీ మొత్తంలో జీఎస్టీ ఎగవేతను గుర్తించారు. 2021 నుంచి జీఎస్టీ బకాయిలు సుమారు రూ.1.50 కోట్ల గుర్తించారు. ఎగ్జిబిషన్ నుంచి సుమారు రూ.1.కోటి, కూరగాయల మార్కెట్, షాపు రూములు ఇతరత్రా వాటి నుంచి మరో రూ.50 లక్షలు జీఎస్టీ ఎగవేతను గుర్తించినట్లు తెలిసింది.

News November 18, 2025

ప్రొద్దుటూరు: భారీ మొత్తంలో జీఎస్టీ ఎగవేత

image

ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో సోమవారం CTO జ్ఞానానంద రెడ్డి ఆధ్వర్యంలో స్టేట్ ట్యాక్స్ అధికారుల బృందం సోదాలు నిర్వహించాయి. భారీ మొత్తంలో జీఎస్టీ ఎగవేతను గుర్తించారు. 2021 నుంచి జీఎస్టీ బకాయిలు సుమారు రూ.1.50 కోట్ల గుర్తించారు. ఎగ్జిబిషన్ నుంచి సుమారు రూ.1.కోటి, కూరగాయల మార్కెట్, షాపు రూములు ఇతరత్రా వాటి నుంచి మరో రూ.50 లక్షలు జీఎస్టీ ఎగవేతను గుర్తించినట్లు తెలిసింది.

News November 18, 2025

కర్నూలు: 595 మందికి షోకాజ్ నోటీసులు

image

‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్‌’ల పంపిణీకి సంబంధించి విద్యార్థుల నుంచి బయోమెట్రిక్ అథెంటికేషన్ పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ చర్యలు తీసుకున్నారు. 26 మంది మండల విద్యాశాఖ అధికారులు, 569 మంది ప్రధానోపాధ్యాయులకు సోమవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 24 గంటల్లో సరైన వివరణ ఇవ్వకుంటే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.