News June 5, 2024

HYD: అంతా BRS.. అయినా BJP..!

image

అసెంబ్లీ ఎన్నికల్లో రాజధానిలోని దాదాపు అన్ని సీట్లలో BRS గెలిచినా ఎంపీ ఎన్నికల్లో మాత్రం BJP గెలిచింది. BRS పార్టీకి చెందిన 18 మంది ఎమ్మెల్యేలు, బలమైన క్యాడర్ ఉన్నా సరే ప్రజలు BJP వైపే మొగ్గు చూపారు. కాగా BRS నేతలు, శ్రేణులు కూడా BJPకి ఓటేశారని.. BRS, BJP ఒక్కటే అని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. లోపాయికారి ఒప్పందంతో అసెంబ్లీలో BRS, లోక్‌సభ ఎన్నికల్లో BJPని గెలిపించుకున్నారని చెబుతున్నారు.

Similar News

News November 10, 2025

జూబ్లీ బైపోల్: ఓటు వేయడానికి 12 ఆప్షన్లు!

image

జూబ్లీహిల్స్‌లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటరు జాబితాలో పేరుంటే చాలు. ఓటరు గుర్తింపు కార్డు కాకుండా 12 ప్రత్యామ్నాయ ఫొటో IDలలో దేనినైనా పోలింగ్ సిబ్బందికి చూపించి ఓటేయొచ్చు. ఆధార్, జాబ్‌కార్డు, బ్యాంకు-పోస్టాఫిస్ పాస్‌బుక్, ఆరోగ్యబీమా స్మార్ట్ కార్డు, ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, PAN, పాస్‌పోర్ట్ చూపించి ఓటు వేయొచ్చని అధికారులు స్పష్టం చేశారు.
SHARE IT

News November 10, 2025

జూబ్లీ బైపోల్: తాయిలాలకు ‘NO’ చెప్పండి!

image

జూబ్లీహిల్స్ ఓటర్లు ఒకసారి ఆలోచించండి. మరో 3 ఏళ్ల వరకు అవకాశం రాదు. తాయిలాలకు తలొగ్గకండి. సమస్యలు పరిష్కరించే సామర్థ్యం ఉన్న వ్యక్తినే అసెంబ్లీకి పంపండి. మద్యం పంచిన వారికి కాదు.. మంచి చేసే సమర్థత ఉన్న వారికి ఓటేయండి. పైసలు పంపిణీ చేసిన వారికి కాకుండా.. పనులు చేసే సత్తా ఉన్న అభ్యర్థికి పట్టం కట్టండి. అభివృద్ధి చేసే సత్తా ఉన్న అభ్యర్థిని గెలిపించండి. వజ్రాయుధం వంటి ఓటును వినియోగించుకోండి.

News November 10, 2025

కోకాపేట్, మూసాపేట్‌లో భూముల వేలం!

image

కోకాపేట్, మూసాపేట్ ప్రాంతాల్లోని 9 ఖాళీ ప్లాట్ల ఈ-వేలం కోసం HMDA సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి నవంబర్ 17 ఉదయం 11:00 గంటలకు T-Hub వేదికగా ప్రీ-బిడ్ సమావేశం నిర్వహించనుంది. కోకాపేట్ నియోపోలిస్ (6), గోల్డెన్ మైల్ (1), మూసాపేట్‌లో (2) ప్లాట్లు వేలం వేయనున్నారు. ఆసక్తిగల డెవలపర్లు పాల్గొనవచ్చని HMDA పిలుపునిచ్చింది. మరింత సమాచారం కోసం www.hmda.gov.inను సంప్రదించండి.
SHARE IT