News May 12, 2024
HYD: అందరూ ఓటేయాలంటూ వినూత్నంగా అవగాహన
ప్రజలకు ఉన్న ఒకే ఒక్క ఆయుధం ఓటు. దానిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మేడ్చల్ పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త తారక్ HYDలోని ప్రధాన మార్గాలు, గల్లీగల్లీ తిరుగుతూ అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు 250 కిలోమీటర్లు తన ద్విచక్ర వాహనంపై తిరుగుతూ తన భుజానికి వేసుకున్న బ్యాగ్ పై Vote is Voice #IVOTEFORSURE అని ఓ స్టిక్కర్ అతికించుకుని ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నారు.
Similar News
News October 3, 2024
సికింద్రాబాద్: సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన ఆమ్రపాలి
సికిందరాబాద్ కంటోన్మెంట్ పరిధిలో సిఖ్ గ్రౌండ్లో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్న డిజిటల్ కార్డు పైలెట్ ప్రాజెక్టు ఏర్పాట్లను GHMC కమిషనర్ ఆమ్రపాలి కాటా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఏలాంటి లోటుపాట్లు లేకుండా పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను
కమిషనర్ ఆదేశించారు. సీఎం పర్యటన నిన్న రాత్రి ఖరారు కావడంతో అధికారులను అప్రమత్తం చేసి ఏర్పాట్లను ఎప్పటికి అప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
News October 3, 2024
HYD: IT వైపే అందరి మొగ్గు.. కోర్ బ్రాంచీల కష్టాలు..!
యువత IT వైపే మొగ్గు చూపుతున్నారు. కోర్ బ్రాంచీలకు కష్టాలు ఏర్పడుతున్న తరుణంలో ఇంజనీరింగ్ కోర్ బ్రాంచ్ అభ్యసించిన వారికి ప్రత్యేక స్కాలర్షిప్ ఇచ్చేందుకు ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. రాజధాని HYDలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో IT, CSE బ్రాంచుల్లో 99% సీట్లు పూర్తిగా భర్తీ అయ్యాయి.అదే కోర్ బ్రాంచీల్లో అనేక ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి.
News October 3, 2024
HYD: ఒక్క క్లిక్తో.. భూ వివరాలు మన చేతుల్లో!
HYD, RR, MDCL, నల్గొండ, సంగారెడ్డి, భువనగిరి, సిద్దిపేట జిల్లాలకు HMDA 2031 మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. అయితే మాస్టర్ ప్లాన్ సహా, ఈ 7 జిల్లాల పరిధిలోని భూ వివరాలను ఒక్క క్లిక్తో ప్రజలు చూసుకునేందుకు ప్రత్యేక యాప్ రానుంది. ఇందులోనే చెరువుల FTL, బఫర్ జోన్ వివరాలు సైతం ఉంటాయి. భవన అనుమతులకు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా యాప్లో దరఖాస్తు చేసుకోవచ్చు.