News May 28, 2024
HYD: అక్రమ హోర్డింగుల తొలగింపుపై దృష్టి
నగరంలో కొన్ని రోజులుగా గాలిదుమారం రేగుతోంది. ఆదివారం పలు ప్రాంతాల్లో విపరీతమైన వేగంతో ఈదురుగాలులు వీచాయి. దీంతో అనేక ప్రాంతాల్లో హోర్డింగులపై ఏర్పాటు చేసిన ప్లెక్సీ బోర్డులు చెల్లాచెదురయ్యాయి. ఒకవేళ అవి వాహనాలపై పడితే. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో GHMC ప్రకటనల విభాగం అప్రమత్తమైంది. నగరవ్యాప్తంగా అక్రమ హోర్డింగులు, ఫ్లెక్సీ బోర్డులను తొలగించేందుకు ప్రైవేటు ఏజెన్సీలను ఆహ్వానించింది.
Similar News
News September 29, 2024
HYD: పింక్ పవర్ రన్.. పాల్గొన్న ఐటీ ఉద్యోగులు
HYD గచ్చిబౌలి స్టేడియంలో పింక్ పవర్ రన్ 3కే, 5కే, 10కే పింక్ పవర్ రన్ను మంత్రి దామోదర రాజనర్సింహ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఐటీ, ఇతర ప్రైవేటు ఉద్యోగులు పాల్గొన్నారు. రొమ్ము క్యాన్సర్పై అవగాహన కల్పించడంలో భాగంగా ఈ పింక్ పవర్ రన్ నిర్వహించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్లో స్థానం సంపాదించేందుకు సుధారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు.
News September 29, 2024
HYD: గాంధీలో పరిశోధనకు రచయిత్రి పార్థివదేహం
ప్రముఖ రచయిత్రి, తెలుగు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ విజయభారతి HYD సనత్నగర్లో కన్నుమూశారు. 1941లో కోనసీమ జిల్లా రాజోలులో జన్మించిన ఈమె.. పద్మభూషణ్ బోయి భీమన్న కుమార్తె, దివంగత సామాజికవేత్త బొజ్జా తారకం సతీమణి. 20కి పైగా పుస్తకాలు రాసి,ఎన్నో పురస్కారాలు పొందారు.ఈమె కుమారుడు రాహుల్ బొజ్జా ప్రస్తుతం నీటిపారుదల శాఖ కార్యదర్శిగా ఉన్నారు. భారతి పార్థీవదేహాన్ని గాంధీ మెడికల్ కాలేజీకి నేడు అందించనున్నారు.
News September 29, 2024
ఓయూ: 30న PDSU స్వర్ణోత్సవాల మహాసభ
PDSU స్వర్ణోత్సవాల మహా సభను ఈ నెల 30న ఓయూలో నిర్వహించనున్నారు. ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో స్వర్ణోత్సవాలను నిర్వహిస్తున్నట్లు PDSU రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రామకృష్ణ, ఆజాద్ కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వర్ణోత్సవ మహాసభలకు ముఖ్య వక్తలుగా ముంబై హైకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ జీబీ కోల్సేపాటిల్ హాజరవుతారని పేర్కొన్నారు.