News October 25, 2024
HYD: అగ్రికల్చర్ యూనివర్సిటీలో భారీగా పెరిగిన సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు

HYD రాజేంద్రనగర్లోని ప్రొ.జయశంకర్ యూనివర్సిటీలో 2024-25లో B.Sc (ఆనర్స్) అగ్రికల్చర్ కోర్సులో సెల్ఫ్ ఫైనాన్స్ కోటా సీట్లు భారీగా పెరిగాయి. ప్రస్తుతం 227 సీట్లు ఉండగా మరో 200 పెంచినట్లు వీసీ ఆల్దాస్ జానయ్య తెలిపారు. ఈ సీట్లకు వార్షిక ఫీజులు సైతం తగ్గించామని, పెరిగిన సీట్లను వ్యవసాయ కళాశాలలో సర్దుబాటు చేస్తామన్నారు. కన్వీనర్ కోటా సీట్ల భర్తీ అనంతరం వీటికి ప్రత్యేక కౌన్సెలింగ్ ఉంటుందన్నారు.
Similar News
News November 18, 2025
HYD: శబరిమల యాత్రికులకు ముఖ్య గమనిక

శబరిమల యాత్రకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరే అయ్యప్ప స్వాములకు కీలక సూచన. ఇకపై ఎయిర్పోర్ట్ అధికారులు క్యాబిన్ బ్యాగ్లో ఇరుముడు పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వడం లేదు. యాత్రికులు ఇరుముడు తప్పనిసరిగా చెక్-ఇన్ లగేజ్లో మాత్రమే ఉంచాలి. చివరి నిమిషంలో అసౌకర్యం ఎదురుకాకుండా ముందస్తుగా ఈ సూచనలను పాటించాలని కొందరు స్వాములు Way2News ద్వారా ఇతర భక్తులకు తెలియజేస్తున్నారు.SHARE IT
News November 18, 2025
HYD: శబరిమల యాత్రికులకు ముఖ్య గమనిక

శబరిమల యాత్రకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరే అయ్యప్ప స్వాములకు కీలక సూచన. ఇకపై ఎయిర్పోర్ట్ అధికారులు క్యాబిన్ బ్యాగ్లో ఇరుముడు పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వడం లేదు. యాత్రికులు ఇరుముడు తప్పనిసరిగా చెక్-ఇన్ లగేజ్లో మాత్రమే ఉంచాలి. చివరి నిమిషంలో అసౌకర్యం ఎదురుకాకుండా ముందస్తుగా ఈ సూచనలను పాటించాలని కొందరు స్వాములు Way2News ద్వారా ఇతర భక్తులకు తెలియజేస్తున్నారు.SHARE IT
News November 17, 2025
రంగారెడ్డి: కలెక్టర్ గారూ.. ప్రభుత్వ బోర్డు మాయమైంది!

రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నా రెవెన్యూ అధికారులు నామమాత్రపు చర్యలతో అక్రమార్కుల దృష్టిలో అలుసైపోతున్నారని తెలంగాణ భూముల పరిరక్షణ సమితి ఉపాధ్యక్షుడు గంటిల వెంకటేశ్ ఆరోపించారు. మంచాల మం. ఆగపళ్లి గ్రామ పంచాయతీలోని సర్వే నం.191లో అధికారులు ఏర్పాటు చేసిన రక్షణ బోర్డు 2 రోజులకే మాయమైంది. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని కలెక్టర్ సి.నారాయణరెడ్డికి సోమవారం ఫిర్యాదు చేశారు.


