News February 4, 2025
HYD: అడ్డొచ్చిన పంది.. MLA గన్మెన్ మృతి (UPDATE)

రోడ్డు ప్రమాదంలో చేవెళ్ల MLA గన్మెన్ శ్రీనివాస్ మృతి చెందిన సంగతి తెలిసిందే. పోలీసుల వివరాలు.. మృతుడు శంకర్పల్లి మం. బుల్కాపూర్ వాసి. వికారాబాద్ జిల్లా AR కానిస్టేబుల్గా పని చేస్తున్నాడు. ఆదివారం బంధువుల ఇంటికి వెళ్లిన అతడు రిటర్న్ అయ్యాడు. బైక్కు <<15346555>>అడవి పంది అడ్డురావడంతో<<>> తప్పించే క్రమంలో కిందపడిపోయాడు. తీవ్రగాయాలతో శ్రీనివాస్ మృతి చెందాడు. సోమవారం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
Similar News
News November 16, 2025
ఇల్లంతకుంట: ‘ఇందిరమ్మ ఇండ్లతో సొంతింటి కల నెరవేరుతోంది’

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంతో సొంత ఇంటి కల నెరవేరుతున్నదని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించగా, ముఖ్య అతిథిగా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు
News November 16, 2025
కరీంనగర్: ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠిన చర్యలు: సీపీ

తమ కార్యాలయ పరిధిలో కొంతమంది పోలీసులు నెంబర్ప్లేట్ లేని వాహనాలు, హెల్మెట్/సీట్బెల్ట్ ధరించకపోవడం, బ్లాక్ ఫిల్మ్ వాడటం వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలు చేస్తున్నట్లు గుర్తించిన సీపీ, కట్టుదిట్టమైన చర్యలకు ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించేవారికి, పోలీసులు అయినా సరే, కఠినంగా ఈ-చలాన్లు జారీ చేయాలని ఏసీపీ ట్రాఫిక్కు ఆయన స్పష్టం చేశారు.
News November 16, 2025
STRANGE: ఈ ఊరిలో 450 మంది ట్విన్స్

ఒక ఊరిలో పది మంది కవలలు ఉంటేనే ఆశ్చర్యంగా చూస్తుంటారు. అలాంటిది 2వేల మంది జనాభా ఉన్న కేరళలోని ‘కొడిన్హి’లో ఏకంగా 450 జతల కవలలు ఉంటే ఇంకెలా ఉంటుంది. అక్కడ కవల పిల్లలు ఎక్కువగా పుట్టడం అంతుచిక్కని విషయంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులు, జన్యు శాస్త్రవేత్తలు ఇప్పటికీ నిర్దిష్టమైన కారణాన్ని మాత్రం గుర్తించలేకపోయారు. అయితే వలస వచ్చిన కుటుంబాలకూ కవలలు జన్మించడం విచిత్రం.


