News February 4, 2025
HYD: అడ్డొచ్చిన పంది.. MLA గన్మెన్ మృతి (UPDATE)

రోడ్డు ప్రమాదంలో చేవెళ్ల MLA గన్మెన్ శ్రీనివాస్ మృతి చెందిన సంగతి తెలిసిందే. పోలీసుల వివరాలు.. మృతుడు శంకర్పల్లి మం. బుల్కాపూర్ వాసి. వికారాబాద్ జిల్లా AR కానిస్టేబుల్గా పని చేస్తున్నాడు. ఆదివారం బంధువుల ఇంటికి వెళ్లిన అతడు రిటర్న్ అయ్యాడు. బైక్కు <<15346555>>అడవి పంది అడ్డురావడంతో<<>> తప్పించే క్రమంలో కిందపడిపోయాడు. తీవ్రగాయాలతో శ్రీనివాస్ మృతి చెందాడు. సోమవారం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
Similar News
News December 9, 2025
కృష్ణా: అనధికార కట్టడాలు బోలెడు.. ఐనా రూపాయి కట్టరు.. ఎందుకంటే..?

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మున్సిపాలిటీల్లో అనధికార కట్టడాలు కోకొల్లలుగా ఉన్నప్పటికీ, వాటిని క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం ఇచ్చిన బీపీఎస్ (BPS) జీఓకు స్పందన కరవైంది. జరిమానాలు అధికంగా ఉండటం, రెగ్యులర్ చేయించుకునేందుకు వెళ్లిన వారికి అధికారులు లంచాలు డిమాండ్ చేస్తుండటంతో కేవలం 10% మంది కూడా ముందుకు రావటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు అవగాహన కూడా కల్పించకపోవడం గమనార్హం.
News December 9, 2025
కాకినాడ: లంచం అడిగితే.. ఈ నంబర్లకు కాల్ చేయండి.!

నేడు కాకినాడ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేసినా, అవినీతికి పాల్పడినట్లు తెలిసినా ప్రజలు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని ACB అధికారులు కోరుతున్నారు. ACB DSP 9440446160, టోల్ ఫ్రీ 1064,14400 నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని సూచిస్తున్నారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని వెల్లడించారు. నేడు అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం.
News December 9, 2025
ఆసిఫాబాద్: ‘సైలెన్స్ పీరియడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు’

గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల ప్రచారం మంగళవారం సా.5 గంటలకు ముగుస్తుందని ASF జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే తెలిపారు. ‘పోలింగ్కు 44 గంటల ముందు నిశబ్ద వ్యవధి అమలులోకి రానుంది. ఈ సమయంలో ర్యాలీలు, ప్రచారాలు నిషేధం. ఇతర ప్రాంతాల వారు పంచాయతీ పరిధిలో ఉండరాదు. బల్క్ ఎస్ఎంఎస్ పంపడంపై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలి’ అని అన్నారు.


