News February 4, 2025
HYD: అడ్డొచ్చిన పంది.. MLA గన్మెన్ మృతి (UPDATE)

రోడ్డు ప్రమాదంలో చేవెళ్ల MLA గన్మెన్ శ్రీనివాస్ మృతి చెందిన సంగతి తెలిసిందే. పోలీసుల వివరాలు.. మృతుడు శంకర్పల్లి మం. బుల్కాపూర్ వాసి. వికారాబాద్ జిల్లా AR కానిస్టేబుల్గా పని చేస్తున్నాడు. ఆదివారం బంధువుల ఇంటికి వెళ్లిన అతడు రిటర్న్ అయ్యాడు. బైక్కు <<15346555>>అడవి పంది అడ్డురావడంతో<<>> తప్పించే క్రమంలో కిందపడిపోయాడు. తీవ్రగాయాలతో శ్రీనివాస్ మృతి చెందాడు. సోమవారం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
Similar News
News November 22, 2025
అక్రమ ఇసుక తవ్వకాల్లో హరీశ్రావు పాత్ర: మెదక్ ఎమ్మెల్యే

అక్రమ ఇసుక తవ్వకాలు జరిపితే చర్యలు తీసుకోవాలని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు.. ఎస్పీ శ్రీనివాస్ రావు, డీఎస్పీ ప్రసన్న కుమార్తో పాటు రెవెన్యూ అధికారులకు సూచించారు. ఇకపై మెదక్లో అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకోవాలని ఆయన స్పష్టమైన సూచనలు ఇచ్చారు. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ నేతలు అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపారని, ఇందులో హరీశ్రావు పాత్ర సైతం ఉందని ఆయన ఆరోపించారు.
News November 22, 2025
బాపట్ల: ‘ఈ అంగన్వాడీలో పనిచేసే కార్యకర్తల వేతనం పెరుగనుంది’

బాపట్ల జిల్లాలోని 16 మినీ అంగన్వాడీ కేంద్రాలను సాధారణ అంగన్వాడీ కేంద్రాలుగా మారుస్తున్నట్లు కలెక్టర్ డా.వినోద్ కుమార్ తెలిపారు. గర్భిణీలు, బాలింతలు, ప్రీస్కూల్ విద్యార్థులకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. మార్పుతో కార్యకర్తల గౌరవ వేతనం రూ.7,000 నుంచి రూ.11,500కు పెరుగుతుందని వెల్లడించారు. ఈ సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
News November 22, 2025
బెంగళూరు ట్రాఫిక్ కంటే అంతరిక్ష ప్రయాణమే సులువు: శుభాంశు

భారత వ్యోమగామి శుభాంశు శుక్లాకు బెంగళూరు ట్రాఫిక్ చిరాకు తెప్పించింది. టెక్ సమ్మిట్లో పాల్గొన్న ఆయన అక్కడి ట్రాఫిక్ కష్టాలపై చమత్కరించారు. ‘బెంగళూరులోని ఈ ట్రాఫిక్ను దాటడం కంటే అంతరిక్షంలో ప్రయాణించడం చాలా సులువు’ అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ‘మారతహళ్లి నుంచి ఈవెంట్కు రావడానికి ప్రసంగానికి కేటాయించిన సమయం కంటే మూడు రెట్లు ఎక్కువ పట్టింది’ అని నవ్వుతూ నగర ప్రజల బాధను హైలైట్ చేశారు.


