News November 29, 2024
HYD: అధికారులూ.. గుర్తుందా శీతాకాలం

HYD మహానగరంలో చాలామంది చలిలో వణుకుతూ ఫుట్పాత్పైనే పడుకుంటున్నారు. వారు చలికి ఇబ్బంది పడకూడదని జీహెచ్ఎంసీ గతంలో దుప్పట్లను పంపిణీ చేసేది. అయితే ఈసారి అధికారులు ఆ విషయమే మర్చిపోయారు. కృష్ణానగర్, ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి, ఇందిరా నగర్, రెయిన్బో ఆస్పత్రి, సాగర్ సొసైటీ, ఖైరతాబాద్ చౌరస్తా, పంజాగుట్ట ప్రాంతాల్లో వందల మంది ఫుట్పాత్పై చలిలో అవస్థలు పడుతున్నా పట్టించు కోవడంలేదని పలువురు ఆరోపిస్తున్నారు.
Similar News
News September 19, 2025
వారంలో మూడు రోజులు ముచ్చింతల్కు బస్సులు

ఆధ్యాత్మిక కేంద్రం ముచ్చింతల్కు వెళ్లేందుకు ఆర్టీసీ అధికారులు బస్సులు ఏర్పాటు చేశారు. ఈ నెల 20 నుంచి శుక్ర, శని, ఆదివారాల్లో బస్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. JBS, ఆఫ్జల్గంజ్, సికింద్రాబాద్, KPHB, ఉప్పల్, రిసాలాబజార్ ప్రాంతాల నుంచి బస్సులు నడుపుతామన్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ సౌకర్యం ఉంటుందని వివరించారు.
News September 19, 2025
కోకాపేట్లో భర్తను చంపిన భార్య

కోకాపేట్లో భర్తను భార్య హత్య చేసిన ఘటన కలకలం రేపింది. పోలీసుల ప్రకారం.. గురువారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో భర్తపై భార్య కత్తితో దాడి చేసింది. ఇంట్లో నుంచి కేకలు రావడంతో స్థానికులు అక్కడికి వచ్చారు. రక్తపు మడుగులో పడి ఉన్న భర్తను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. వారిని అస్సాంకి చెందిన వారిగా గుర్తించారు. భార్యాభర్తల మధ్య విభేదాలే ఈ దారుణానికి దారితీసింది.
News September 19, 2025
HYD: పూల వర్షం.. బతుకమ్మకు సరికొత్త అందం!

తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఈసారి అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో భాగ్యనగర వీధులు పూల పండుగ శోభతో ముస్తాబవ్వనున్నాయి. తెలంగాణలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ ఘనత చాటి చెప్పేలా బహుముఖ ప్రణాళికలు రూపొందాయి. ఊహకందని ఏర్పాట్లులతో ఈ వేడుకలు భాగ్యనగరానికి కొత్త ఉత్సాహాన్ని తీసుకురానున్నాయి.