News April 7, 2024

HYD: అన్నం వండలేదని చంపేశారు

image

HYDలో దారుణఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ వాసి హన్స్‌రామ్(38) కుత్బుల్లాపూర్‌లో ఉంటున్నాడు. భార్య 2 నెలల క్రితం ఊరెళ్లింది. నాటినుంచి జీడిమెట్లలోని బినయ్‌సింగ్ గదిలో ఉంటున్నాడు. మంగళవారం అన్నం వండలేదని బినయ్‌సింగ్‌ను అదే గదిలో ఉండే సందీప్, సోను మద్యం మత్తులో కొట్టారు. హన్స్‌రామ్‌నూ విచక్షణా రహితంగా కొట్టడంతో చనిపోయాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News December 3, 2025

GHMC బోర్డులు పెట్టండి: కమిషనర్

image

GHMCలో 27 పురపాలికల విలీనానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ పత్రంలో GHMC కమిషనర్ కర్ణన్, డిప్యూటీ కమిషనర్లకు పలు బాధ్యతలు అప్పగించారు. GHMC బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. అంతేకాక మినిట్ బుక్ సీజింగ్, ఉద్యోగుల సంఖ్య, ప్రాపర్టీస్ వివరాలు, గత మూడు సంవత్సరాల్లో జారీ చేసిన బిల్డింగ్, లేఅవుట్ పర్మిషన్లు, వర్క్, మెటీరియల్ బిల్స్ డేటా సైతం ప్రిపేర్ చేయాలన్నారు.

News December 3, 2025

GHMC బోర్డులు పెట్టండి: కమిషనర్

image

GHMCలో 27 పురపాలికల విలీనానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ పత్రంలో GHMC కమిషనర్ కర్ణన్, డిప్యూటీ కమిషనర్లకు పలు బాధ్యతలు అప్పగించారు. GHMC బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. అంతేకాక మినిట్ బుక్ సీజింగ్, ఉద్యోగుల సంఖ్య, ప్రాపర్టీస్ వివరాలు, గత మూడు సంవత్సరాల్లో జారీ చేసిన బిల్డింగ్, లేఅవుట్ పర్మిషన్లు, వర్క్, మెటీరియల్ బిల్స్ డేటా సైతం ప్రిపేర్ చేయాలన్నారు.

News December 3, 2025

GHMCలో పురపాలికల విలీనంపై ప్రొసీడింగ్స్

image

ORR వరకు 27 మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ల విలీనానికి సంబంధించి GHMC కమిషనర్ కర్ణన్ ప్రొసీడింగ్స్ విడుదల చేశారు. పురపాలక సంఘాల రికార్డుల పరిశీలన కోసం GHMC డిప్యూటీ కమిషనర్లు, మానిటరింగ్ ఆఫీసర్లుగా జోనల్ కమిషనర్లను నియమించారు. ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పురపాలిక అకౌంటు బ్యాలెన్స్ సైతం GHMC అకౌంట్‌కు ట్రాన్స్ ఫర్ చేయాలని పేర్కొన్నారు.