News November 29, 2024
HYD: అప్పు చేసి పిల్లలకు వంట చేస్తున్నారు: CITU

మధ్యాహ్న భోజన పథకం కార్మికులు MEO ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. CITU జిల్లా ఉపాధ్యక్షుడు జగదీశ్ మాట్లాడారు. కార్మికులకు ఇచ్చే గౌరవ వేతనం, మెనూ ఛార్జీలు పెండింగులో ఉన్నాయన్నారు. నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో అప్పులు చేసి ప్రభుత్వానికి ఎదురు పెట్టుబడి పెట్టి వంట చేసి పెడుతూ.. కార్మికులు అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Similar News
News November 25, 2025
GHMC కౌన్సిల్ హాల్లో తగ్గేదే లే!

GHMC కీలక సమావేశానికి వేదికైంది. మరో 3 నెలల్లో పాలకవర్గం ముగియనుంది. మేయర్ అధ్యక్షతన నేడు జరిగే సర్వసభ్య సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ఇప్పటికే ప్రధాన పార్టీల నేతలు సభ్యులకు దిశానిర్దేశం చేశారు. ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి, కొన్ని అంశాలకు కౌన్సిల్ ఆమోదం తెలపనుంది. చర్చల్లో భాగంగా ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టాలని ప్రతిపక్షాలు, ధీటైన సమాధానం ఇచ్చేందుకు కాంగ్రెస్ సభ్యులు కూడా తగ్గేదే లే అంటున్నారు.
News November 25, 2025
EXCLUSIVE: 15 ఏళ్ల తర్వాత తొలుగుతోన్న ముసుగులు

GHMCలో 15 ఏళ్లుగా ముసుగు కప్పుకున్న విగ్రహాల తెర వీడుతోంది. స్టాండింగ్ కమిటీ నుంచి ఆమోదం పొంది 5 నెలలు గడిచినా మధ్యలో పనులు ఆలస్యం అయ్యాయి. ప్రస్తుతం ప్రధాన కార్యాలయంలోనూ బ్యూటిఫికేషన్ పనులు పూర్తి చేశారు. విగ్రహాలను తరలించే ప్రక్రియను అధికారులు చేపట్టారు. ప్రస్తుతం ఈ పనులు తుది దశకు చేరాయి. డిసెంబర్ మొదటి వారంలో మరోచోట విగ్రహాల ఆవిష్కరణ ఉంటుందని సమాచారం.
News November 25, 2025
బల్దియా.. బస్తీమే Kya Kiya?

నేటి GHMC సర్వసభ్య సమావేశాలు అసెంబ్లీ చర్చలను మించేలా ఉన్నాయి. గతంలోనూ నిర్ణీత సమయంలో ఒక అంశం మీద చర్చ జరుగుతుంటే మరోవైపు నిరసనలతో సభ రసాభాసాగా మారింది. ప్రతిసారి ఇదే తంతు అన్న విమర్శలొచ్చాయి. అసలు చర్చ పక్క దారి పడుతోందని కొందరు సభ్యులు మొరపెట్టుకున్నారు. అయితే, <<18381319>>సిటీలోని బస్తీల్లో<<>> సమస్యలు తాండవిస్తున్నాయని, నేడు అయినా వీటిపై చర్చించాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.


