News February 3, 2025
HYD: అబద్ధాలు చెప్పిన KCR: కోదండరాం రెడ్డి

కాళేశ్వరం కట్టతో పాటు అది ఎంతో అద్భుతమైన ప్రాజెక్టు అంటూ KCR అవాస్తవాలు కూడా నిర్మించారని MLC కోదండరాం రెడ్డి ఆరోపించారు. HYD సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సీనియర్ జర్నలిస్ట్ రేమిల్ల అవధాని రచించిన ‘కాళేశ్వరం ఫియాస్కో: ఎ టేల్ ఆఫ్ గ్రీడ్ అండ్ నెగ్లిజెన్స్’ పుస్తకాన్ని TG మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన ఆవిష్కరించారు. KCR అబద్ధాలు చెప్పారని, కాళేశ్వరంతో అనేక సమస్యలు వస్తున్నాయన్నారు.
Similar News
News November 6, 2025
రెవెన్యూ డివిజన్గా నక్కపల్లి?

అనకాపల్లి జిల్లాలో కొత్తగా మరో రెవెన్యూ డివిజన్ను ఏర్పాటు కానుంది. ఈ మేరకు జిల్లా అధికారులు కసరత్తు చేసి, ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి మండలం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని యలమంచిలి, పాయకరావుపేట, ఎస్.రాయవరం, కోటవురట్ల, నక్కపల్లి మండలాలతో ఈ రెవెన్యూ డివిజన్ను ఏర్పాటు చేసే ఆలోచనలో సర్కారు ఉన్నట్లు సమాచారం.
News November 6, 2025
రాష్ట్రంలో 2 కొత్త జిల్లాలు?

AP: రాష్ట్రంలో కొత్తగా 2 జిల్లాల ఏర్పాటుకు మంత్రివర్గ ఉపసంఘం సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉన్న మార్కాపురం, చిత్తూరు జిల్లాలోని మదనపల్లె కేంద్రాలుగా జిల్లాలు ఏర్పాటుకానున్నట్లు సమాచారం. అలాగే నక్కపల్లి, అద్దంకి, మడకశిర, బనగానపల్లె, పీలేరు, అవనిగడ్డ, గిద్దలూరు పట్టణాలను రెవెన్యూ డివిజన్లుగా మార్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
News November 6, 2025
ఖమ్మం: మంత్రులు, ఎమ్మెల్యేలు జర పట్టించుకోండి..!

తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న వరుస బస్సు ప్రమాదాల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని అధ్వాన రహదారులు ప్రజలను కలవరపెడుతున్నాయి. జిల్లాలోని ముగ్గురు మంత్రులు, ఏడుగురు MLAలు ప్రభుత్వం నుంచి అధిక నిధులు తీసుకొచ్చి గుంతలమయమైన రోడ్లకు పునఃనిర్మాణం/మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లా సరిహద్దు కావడంతో నిత్యం వేలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి కాబట్టి ముందస్తు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


