News February 3, 2025

HYD: అబద్ధాలు చెప్పిన KCR: కోదండరాం రెడ్డి

image

కాళేశ్వరం కట్టతో పాటు అది ఎంతో అద్భుతమైన ప్రాజెక్టు అంటూ KCR అవాస్తవాలు కూడా నిర్మించారని MLC కోదండరాం రెడ్డి ఆరోపించారు. HYD సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సీనియర్ జర్నలిస్ట్ రేమిల్ల అవధాని రచించిన ‘కాళేశ్వరం ఫియాస్కో: ఎ టేల్ ఆఫ్ గ్రీడ్ అండ్ నెగ్లిజెన్స్’ పుస్తకాన్ని TG మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన ఆవిష్కరించారు. KCR అబద్ధాలు చెప్పారని, కాళేశ్వరంతో అనేక సమస్యలు వస్తున్నాయన్నారు.

Similar News

News September 16, 2025

GWL: స్ట్రాంగ్ రూమ్ వద్ద పటిష్ఠ భద్రత ఉండాలి- కలెక్టర్

image

ఎన్నికల సామగ్రి భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద పటిష్ఠ భద్రత ఉండాలని గద్వాల కలెక్టర్ సంతోష్ సూచించారు. మంగళవారం వివిధ రాజకీయ పార్టీల నేతలతో కలెక్టరేట్ ఆవరణలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ పరిశీలించారు. అక్కడ ఈవీఎంలకు సంబంధించిన రికార్డులు, సీసీ కెమెరాల పనితీరును పర్యవేక్షణ చేశారు. ఎన్నికల సంఘం ఆదేశం మేరకు పరిశీలించినట్లు కలెక్టర్ తెలిపారు. స్థానిక తహశీల్దార్ మల్లికార్జున్ పాల్గొన్నారు.

News September 16, 2025

పంట దిగుబడిని పెంచే నానో ఎరువులు

image

వ్యవసాయంలో చాలా కాలంగా రైతులు సంప్రదాయ యూరియా, DAPలను ఘన రూపంలో వాడుతున్నారు. వాటి స్థానంలో భారత రైతుల సహకార ఎరువుల సంస్థ(IFFCO) ద్రవరూపంలో నానో యూరియా, నానో DAPలను అందుబాటులోకి తెచ్చింది. వీటిని సూచించిన పరిమాణంలో నీటితో కలిపి పిచికారీ చేస్తే.. ఆకులలోని పత్రరంధ్రాల ద్వారా ఎరువులోని పోషకాలను మొక్కలు 80-90 శాతం గ్రహిస్తాయి. దీని వల్ల ఎరువు నష్టం తగ్గి దిగుబడులు పెరుగుతాయని IFFCO చెబుతోంది.

News September 16, 2025

నానో ఎరువులను ఎలా వాడాలి?

image

నానో యూరియా, DAPలను పైరుపై పిచికారీ పద్ధతిలోనే వాడాలి. వీటిని భూమిలో, డ్రిప్‌‌లలో వాడకూడదు. పంటలకు దుక్కిలో వ్యవసాయ నిపుణులు సిఫార్సు చేసిన ఎరువులను యథావిధిగా వేయాలి. పంటకు పైన ఎరువులను సిఫార్సు చేసినప్పుడు మాత్రం.. నానో ఎరువుల రూపంలో పిచికారీ చేసుకోవాలి. నానో యూరియా, DAPలను ఎకరాకు అర లీటరు(లీటరు నీటికి 4ml)చొప్పున పిచికారీ చేయాలి. తర్వాత సంప్రదాయ యూరియా, DAPలను పంటకు వేయనవసరం లేదు.