News March 17, 2025
HYD: అమెరికాలో ప్రమాదం.. కొందుర్గు వాసులు మృతి

అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా వాసులు చనిపోయారు. కొందుర్గు మండలంలోని టేకులపల్లికి చెందిన BRS నాయకుడు, మాజీ MPTC, మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి కూతురు ప్రగతిరెడ్డి(35), మనవడు హార్వీన్ (6), సునీత (56) మృతి చెందారు. ప్రగతి అత్త సునీత సిద్దిపేట జిల్లా బక్రీ చప్రియాల్ గ్రామం. అయితే, అంత్యక్రియలు అక్కడే చేస్తున్నట్లు సమాచారం.
Similar News
News December 1, 2025
శ్రీకాంత్ మాల్డే, చార్మి బిజినెస్ సక్సెస్ సీక్రెట్ ఇదే

శ్రీకాంత్, చార్మి ఎప్పుడూ సాదా సీదా జీవితాన్ని గడపడం, కల్తీలేని ఆర్గానిక్ పద్ధతిని ఎంచుకోవడం, వినియోగదారులతో నిజాయితీగా వ్యవహరించడం చుట్టు పక్కల జనానికి, వారి దగ్గర పాల ఉత్పత్తులను కొనేవారికి బాగా నచ్చింది. ముఖ్యంగా మౌత్ పబ్లిసిటీతోనే వారి వ్యాపారం బాగా జరిగింది. ఫలితంగా రోజురోజుకీ వారి ఉత్పత్తులకు డిమాండ్ పెరిగి 2024 నాటికే రూ.2 కోట్ల టర్నోవర్ సాధించి, ఇప్పుడు మరింత ఆదాయం దిశగా దూసుకెళ్తున్నారు.
News December 1, 2025
పలు జిల్లాల్లో భారీ వర్షాలు

TG: రాష్ట్రంలోని పలు జిల్లాలపై దిత్వా తుఫాను ప్రభావం ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. ఇవాళ ఖమ్మం, భద్రాద్రి, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని పేర్కొంది. రానున్న 3 రోజులు చలి గాలులు అధికంగా వీచే అవకాశముందని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను హెచ్చరించింది. అర్ధరాత్రి నుంచి భద్రాద్రి, ఖమ్మం, ఆసిఫాబాద్, నల్గొండ తదితర జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో జల్లులు పడుతున్నాయి.
News December 1, 2025
గెలిచిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్లు

మెదక్ జిల్లాలో నవంబర్ 28 నుంచి ఆదివారం వరకు జరిగిన 44వ తెలంగాణ రాష్ట్రస్థాయి ఖోఖో జూనియర్ బాలబాలికల పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్లు ప్రతిభ కనబర్చాయి. ఈ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాలుర, బాలికల జట్లు మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకాలు సాధించాయి. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ఖోఖో సంఘం సభ్యులు, క్రీడాభిమానులు అభినందించారు.


