News March 12, 2025

HYD: అమ్మా..నాన్నా.. మేం చనిపోతున్నాం! (లెటర్)

image

హబ్సిగూడ‌లో ఆత్మహత్య చేసుకున్న దంపతుల సూసైడ్ నోట్ కన్నీరు పెట్టిస్తోంది. ‘అమ్మా.. నాన్న.. మీకు భారంగా ఉండలేక చనిపోతున్నాం. మీరు బాధపడకండి. అన్నా వదిన మిమ్మల్ని మంచిగా చూసుకుంటారు. నా వల్ల ఎప్పుడు మీకు బాధలే. ఏడవకు అమ్మ, నేను నిన్ను వదిలి వెళ్లిపోయా. ఈ బాధ కొద్ది రోజులే, నాకు జీవించాలని అనిపించడం లేదు. నా వరకు ఈ నిర్ణయం కరెక్టే’ అంటూ చంద్రశేఖర్ రెడ్డి తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.

Similar News

News November 1, 2025

ప్రభుత్వ విద్యా సంస్థల్లో మెరుగైన విద్య అందించాలి

image

ప్రభుత్వ విద్యా సంస్థల్లో పిల్లలకు మెరుగైన విద్యను అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణి ఆదేశించారు. శుక్రవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ రాజార్షి షా, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, విద్యాశాఖ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. నాణ్యమైన బోధన, మౌలిక వసతుల కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె సూచించారు.

News November 1, 2025

ADB: జూబ్లీ పోరు.. మనోళ్ల ప్రచార జోరు

image

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రతి జిల్లా నుంచి ఆయా రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు అక్కడికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ఉమ్మడి ADB నుంచి కాంగ్రెస్ నేత, మంత్రి వివేక్ వెంకటస్వామి,బీఆర్ఎస్ నుంచి అనిల్ జాదవ్, బాల్క సుమన్ తదితర నేతలు ప్రచారం జోరు పెంచారు. వీరితోపాటు మండల నేతలను తీసుకెళ్లడంతో ఎంత ప్రభావం చూపుతారోననే ఆసక్తి నెలకొంది.

News November 1, 2025

ఆదిలాబాద్: ఓపెన్ ఫలితాలు విడుదల

image

TOSS ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదలైనట్లు DEO ఖుష్బూ గుప్తా, ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ అశోక్ తెలిపారు. సెప్టెంబర్ 22 – 28వరకు జరిగిన పరీక్షల ఫలితాలు https://www.telanganaopenschool.org/ వెబ్ సైట్‌లో పొందుపర్చినట్లు పేర్కొన్నారు. మెమోల్లో పొరపాట్లుంటే ఈ నెల 14వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పదో తరగతి రీకౌంటింగ్ కోసం పేపర్ కు రూ.350, ఇంటర్‌కు రూ.400 చెల్లించాలన్నారు.