News March 12, 2025
HYD: అమ్మా..నాన్నా.. మేం చనిపోతున్నాం! (లెటర్)

హబ్సిగూడలో ఆత్మహత్య చేసుకున్న దంపతుల సూసైడ్ నోట్ కన్నీరు పెట్టిస్తోంది. ‘అమ్మా.. నాన్న.. మీకు భారంగా ఉండలేక చనిపోతున్నాం. మీరు బాధపడకండి. అన్నా వదిన మిమ్మల్ని మంచిగా చూసుకుంటారు. నా వల్ల ఎప్పుడు మీకు బాధలే. ఏడవకు అమ్మ, నేను నిన్ను వదిలి వెళ్లిపోయా. ఈ బాధ కొద్ది రోజులే, నాకు జీవించాలని అనిపించడం లేదు. నా వరకు ఈ నిర్ణయం కరెక్టే’ అంటూ చంద్రశేఖర్ రెడ్డి తన సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు.
Similar News
News March 25, 2025
భీమదేవరపల్లి: తెల్లవారుజామున యాక్సిడెంట్.. ఒకరి మృతి

భీమదేవరపల్లి మండలం ముల్కనూర్- ఎల్కతుర్తి రహదారిపై మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో కారు నుజ్జునుజ్జయింది. అందులో ప్రయాణిస్తున్న కనకపూడి కర్ణాకర్ అనే పాస్టర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 25, 2025
బాపట్ల: ‘నా కొడుకు చంపాలని చూస్తున్నాడు’

ఆస్తిరాయించుకొని తన కొడుకు తనను చంపాలనుకుంటున్నాడని సయ్యద్ కరిమూన్, బొప్పుడి బాపట్ల SP వద్ద వాపోయారు. ‘నాకు ఇద్దరు మగపిల్లలు, ఒకమ్మాయి. పెద్ద కొడుకు చనిపోయాడు. నా చిన్నకొడుకు సయ్యద్ మోహిద్దీన్, కోడలు నజీమూన్లు ఆస్తీ మొత్తం తీసుకుని నన్ను, నా భర్తను చంపాలని చూశారు. దీంతో నాభర్త భయంతో పారిపోయాడు. నేను ప్రాణభయంతో వేటపాలెంలోని నా కూతరు వద్ద ఉన్నా, నన్ను కాపాడండి’ అని వేడుకున్నారు.
News March 25, 2025
ఒంగోలు: యువకుల ఫోన్ల తనిఖీ

IPL బెట్టింగ్తో పాటు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ వాడే వారి సంఖ్య పెరుగుతోంది. ఈక్రమంలో పోలీసులు నిఘా పెంచారు. ఒంగోలు బస్టాండ్ వద్ద డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు యువకుల ఫోన్లు చెక్ చేశారు. బెట్టింగ్ యాప్స్, సింగిల్ నంబర్ వాడే వారిని గుర్తించారు. 300 మంది అనుమానితులను తనిఖీ చేసి రూ.5,500 సీజ్ చేశారు. యువత బెట్టింగ్కు అలవాటై జీవితాన్ని నాశనం చేసుకోవద్దని డీఎస్పీ కోరారు.