News June 20, 2024
HYD: ‘అమ్మా నేను వెళ్లిపోతున్నా.. వచ్చే ఏడాది వస్తా’

యువకుడు అదృశ్యమైన ఘటన రంగారెడ్డి జిల్లా కొందుర్గులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. తంగడపల్లికి చెందిన భిక్షమయ్య కుమారుడు ఠాను(20) డిగ్రీ చదువుతున్నాడు. 18న డిగ్రీ సెమిస్టర్ పరీక్ష రాసి ఇంటికి వచ్చాడు. అనంతరం ‘అమ్మా నేను ఇంటి నుంచి వెళ్లిపోతున్నా.. మళ్లీ సంవత్సరం తర్వాత వస్తా’ అంటూ లెటర్ రాసి తన బైక్ తీసుకొని వెళ్లాడు. తల్లిదండ్రులు ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో PSలో ఫిర్యాదు చేశారు.
Similar News
News October 21, 2025
ఈనెల 25తో ముగియనున్న సర్వే: రంగారెడ్డి కలెక్టర్

తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ రూపకల్పన కోసం ఉద్దేశించిన “తెలంగాణ రైజింగ్ – 2047” సిటిజన్ సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని RR జిల్లా కలెక్టర్ C.నారాయణ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు ఈ సిటిజన్ సర్వేలో కేవలం తెలంగాణ పౌరులు పాల్గొని తమ విలువైన సమాచారాన్ని అందజేశారన్నారు. దేశ స్వాతంత్య్రానికి 100 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలో ప్రజలు సలహాలు ఇవ్వాలన్నారు.
News October 21, 2025
HYD: సెల్యూట్.. వీరులారా మీకు వందనం!

తెలంగాణ పోలీస్ శాఖ ఉలిక్కిపడిన ఘటన ఇది. మావోలు ఏకంగా పోలీస్ స్టేషన్ను పేల్చేశారు. ఇది జరిగి 28 ఏళ్లు గుడుస్తున్నా నేటికి అమరులైన పోలీసులే యాదికొస్తుండ్రు. 1997లో యాచారం PSలో జమీల్ అహ్మద్, రాజేశ్వర్ రావు కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. పథకం ప్రకారం మావోలు స్టేషన్ను పేల్చివేయడంతో విధి నిర్వహణలోనే ప్రాణాలు విడిచారు. పోలీస్ సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసు అమరులకు నివాళి అర్పిద్దాం.
News October 19, 2025
HYD: యూట్యూబర్లపై సైబర్ క్రైమ్ కొరడా

మైనర్లతో అసభ్యకరమైన కంటెంట్ ప్రచురించినందుకు గాను రెండు యూట్యూబ్ ఛానెళ్లపై POCSO చట్టం కింద కేసు నమోదైంది. నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ మీడియాలో స్వేచ్ఛ ఉంది కదా అని చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీస్ శాఖ హెచ్చరించింది.