News April 15, 2025
HYD: అర్ధనగ్న నృత్యాలు.. 17 మంది యువతులు అరెస్ట్

HYDలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా చైతన్యపురి వైల్డ్ హార్ట్ క్లబ్లో రైడ్స్ చేశారు. సమయానికి మించి పబ్ నడపడం, యువతులతో అర్ధనగ్న నృత్యాలు చేయిస్తున్నట్లు గుర్తించారు. కస్టమర్లని ఆకట్టుకునేలా యువతులతో ఇలా చేయించడం గమనార్హం. ముంబై నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి మరీ కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. మొత్తం 17మంది యువతులు, పబ్ నిర్వాహకుడు, కస్టమర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
Similar News
News October 26, 2025
KNR: ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తిపై సీఈఆర్సీ సమీక్ష

ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్ట్ను సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ సభ్యుడు వీ.రమేష్బాబు శనివారం సందర్శించారు. ఎన్టీపీసీ రామగుండం ఈడి చందన్ కుమార్ సమంత ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టు వద్ద నూతనంగా నిర్మించిన సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ భవనాన్ని వారు ప్రారంభించారు. ప్రాజెక్ట్లోని స్విచ్యార్డ్ను సందర్శించారు. విద్యుత్ ఉత్పత్తిపై సమీక్షించారు.
News October 26, 2025
సిద్దిపేట: ‘యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలే మేలు’

సిద్దిపేట జిల్లా తోర్నాల వ్యవసాయ పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో పొద్దుతిరుగుడు పంట మేలైన సాగు పద్ధతిపై రైతులకు శనివారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శాస్త్రవేత్త సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. యాసంగిలో వరికి బదులు అరుతడి పంటలైన పొద్దుతిరుగుడు, వేరుశనగ, ఆవాలు, శనగ, కూరగాయలు సాగు చేయాలని సూచించారు. అరుతడి పంటల సాగుతో కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించారు.
News October 26, 2025
కొడిమ్యాల: ధాన్యం తేమ 17% లోపు ఉండాలి: కలెక్టర్

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో వరి కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవం సందర్భంగా కలెక్టర్ బి.సత్యప్రసాద్ మాట్లాడారు. రైతులు ధాన్యం తేమ 17%లోపు ఉండేలా చూసుకోవాలని సూచించారు. నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ధాన్యం తీసుకువచ్చిన రైతులకు కనీస మద్దతు ధర చెల్లిస్తామన్నారు. గ్రేడ్ ‘ఏ’ రకానికి రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369 మద్దతు ధర చెల్లించడం జరుగుతుందని వివరించారు.


