News August 9, 2024
HYD: అర్హులకే అసైన్డ్ భూములు: భట్టి విక్రమార్క

ఇందిరాగాంధీ కాలంలో భూమి లేని పేదలకు పంచిన ఆసైన్డ్ భూములు తిరిగి అర్హులకే చెందేలా చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భరోసానిచ్చారు. మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నాదర్గుల్ రైతులు ప్రగతిభవన్లో డిప్యూటీ సీఎంను కలిసి తమకు కేటాయించిన భూములను కొంతమంది ప్రైవేటు వ్యక్తులు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని పిర్యాదు చేశారు. తగిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం తెలిపారు.
Similar News
News November 2, 2025
HYD: ప్రచారంలో దోశ వేసిన మంత్రి

జూబ్లీహిల్స్ పరిధి రహమత్నగర్ డివిజన్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు ఉపఎన్నిక ప్రచారాన్ని నిర్వహించారు. శ్రీరామ్ నగర్, సంధ్యా నగర్, కార్మిక నగర్, వినాయకనగర్, ఎస్పీఆర్ హిల్స్లో పాదయాత్ర నిర్వహించి, ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించాలని కోరారు. అనంతరం ఓ హోటల్లో మంత్రి దోశ వేసి సందడి చేశారు. కాంగ్రెస్ను గెలిపించి, ప్రజాపాలనకు మద్దతు తెలపాలన్నారు.
News November 2, 2025
HYD: తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ నూతన కమిటీ ఏర్పాటు

తెలంగాణ జాగృతి బలోపేతంపై కవిత ఫోకస్ పెట్టారు. తాజాగా టీచర్స్ ఫెడరేషన్ నూతన కమిటీని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఫెడరేషన్ నూతన కమిటీ అధ్యక్షుడిగా మోరం వీరభద్రరావు, ఉపాధ్యక్షుడిగా బుర్ర రమేశ్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా జాడి శ్రీనివాస్, కోశాధికారిగా ఘనపురం దేవేందర్ను నియమించినట్లు ఆమె తెలిపారు. వెంటనే వీరి నియామకాలు అమల్లోకి వస్తాయని కవిత పేర్కొన్నారు.
News November 2, 2025
HYD: చంచల్గూడ జైలుకు ఒమర్ అన్సారీ

HYDలోని చాదర్ఘాట్ పరిధిలో గల విక్టోరియా ప్లే గ్రౌండ్లో గత శనివారం కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిందితుడు ఒమర్ అన్సారీ కోలుకోవడంతో శనివారం పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్కు ఆదేశించడంతో అతడిని చంచల్గూడ జైలుకు పోలీసులు తరలించారు.


