News February 11, 2025
HYD: అలవాట్ల మార్పుతో క్యాన్సర్: MNJ డాక్టర్

అలవాట్ల మార్పుతో క్యాన్సర్ల ప్రభావం రోజు రోజుకు పెరుగుతోంది. తంబాకు, గుట్కా, పాన్ మసాలా, జంక్ ఫుడ్ పలు సమస్యలు కారణంగా మారుతోంది. వ్యాధిని తొలి దశలో గుర్తిస్తే 90% నియంత్రించవచ్చని, ముఖ్యంగా జంక్ ఫుడ్స్, పర్యావరణ కాలుష్యం, రసాయన మందులతో పండించిన ఆహార పదార్థాల ద్వారా ముప్పు పెరుగుతున్నట్లు HYD MNJ క్యాన్సర్ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు.
Similar News
News November 14, 2025
‘రహేజా’కు భూ కేటాయింపుతో APకి ఏం లాభం? SMలో ప్రశ్నలు

AP: విశాఖలో రహేజా సంస్థకు 99 పైసలకే 27 ఎకరాల భూ కేటాయింపును నెటిజన్లు తప్పుబడుతున్నారు. భారీగా ఉద్యోగాలు కల్పించే TCS లాంటి కంపెనీలకు ఇవ్వడంలో తప్పు లేదు కానీ, కమర్షియల్ బిల్డింగ్స్ కట్టే రియల్ ఎస్టేట్ సంస్థకు కారుచౌకగా కట్టబెడతారా? అని ప్రశ్నిస్తున్నారు. ప్రజల ఆస్తిని కొద్దిమంది బలవంతులకు భోజనంగా వడ్డించినట్లు ప్రభుత్వ నిర్ణయం ఉంది తప్ప, APకి ఏ లాభం కన్పించడం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు.
News November 14, 2025
టాస్ ప్రాక్టీస్ చేస్తున్న సౌతాఫ్రికా కెప్టెన్.. కారణమిదే!

కోల్కతాలో రేపు సౌతాఫ్రికా-ఇండియా మధ్య తొలి టెస్టు జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రొటీస్ కెప్టెన్ బవుమా ఓ సరదా విషయాన్ని పంచుకున్నారు. ‘ఇటీవల కేన్ విలియమ్సన్ను కలిశా. భారత్ను ఓడించేందుకు కొన్ని పాయింట్స్ అడిగా. కేన్ పెద్దగా ఓపెన్ కాలేదు. కానీ టాస్ గెలవాలని చెప్పాడు. దీంతో అప్పటి నుంచి కాయిన్ టాస్ వేయడం ప్రాక్టీస్ చేస్తున్నా’ అని చెప్పారు. తాము సిరీస్ కోసం బాగానే సిద్ధమయ్యామని అనుకుంటున్నానని తెలిపారు.
News November 14, 2025
అన్నమయ్య జిల్లాలో విజిబుల్ పోలీసింగ్

ప్రజల భద్రతే లక్ష్యంగా ‘విజిబుల్ పోలీసింగ్’ ముమ్మరం చేసినట్లు అన్నమయ్య జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం గురువారం వెల్లడించింది. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా ‘విజిబుల్ పోలీసింగ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీసులు నేరుగా ప్రజల్లోకి వెళ్లి, వారి భద్రతకు భరోసా కల్పిస్తున్నారు. ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.


