News February 11, 2025
HYD: అలవాట్ల మార్పుతో క్యాన్సర్: MNJ డాక్టర్

అలవాట్ల మార్పుతో క్యాన్సర్ల ప్రభావం రోజు రోజుకు పెరుగుతోంది. తంబాకు, గుట్కా, పాన్ మసాలా, జంక్ ఫుడ్ పలు సమస్యలు కారణంగా మారుతోంది. వ్యాధిని తొలి దశలో గుర్తిస్తే 90% నియంత్రించవచ్చని, ముఖ్యంగా జంక్ ఫుడ్స్, పర్యావరణ కాలుష్యం, రసాయన మందులతో పండించిన ఆహార పదార్థాల ద్వారా ముప్పు పెరుగుతున్నట్లు HYD MNJ క్యాన్సర్ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు.
Similar News
News November 10, 2025
మెదక్: ప్రజావాణి కార్యక్రమంలో 75 దరఖాస్తులు

మెదక్ కలెక్టరెట్లోని ప్రజావాణిలో మొత్తం 75 దరఖాస్తులు స్వీకరించినట్లు అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. వీటిల్లో భూ సమస్యలకు సంబంధించి 34, పింఛన్లకు సంబంధించి 14, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 05, దరఖాస్తులు వచ్చాయన్నారు. మిగిలిన 26 దరఖాస్తులు ఇతర సమస్యలకు సంబంధించినవని పేర్కొన్నారు. ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
News November 10, 2025
విశాఖ అభివృద్ధిలో ‘తెన్నేటి’ మార్క్

ఆంధ్రరాష్ట్ర తొలి రెవెన్యూ మంత్రిగా, విశాఖ MPగా పనిచేసిన తెన్నేటి విశ్వనాథంకి తెలుగు సంస్కృత భాషలలో మంచి పట్టుంది. విశాఖ అభివృద్ధిలో ఎంతో కృషి చేశారు. కాఫీ బోర్డు ప్రెసిడెంటుగా ఉన్న రోజుల్లోనే అరకులో కాఫీ తోటల పెంపకానికి ముందడుగు పడింది. ఆయనకు గుర్తుగా GVMCభవనానికి ‘తెన్నేటి భవన్’, కైలాసగిరి కొండ కింద ఉన్న పార్కుకి ‘తెన్నేటి పార్క్’ అని పేరు పెట్టారు. నేడు ఆయన వర్థంతి సందర్భంగా స్మరించుకుందాం.
News November 10, 2025
పెదిర్పహాడ్లో చిరుత సంచారం.. గ్రామస్థుల భయాందోళన

మద్దూరు మండలం పెదిర్పహాడ్లో సోమవారం సాయంత్రం చిరుత పులులు సంచరించాయి. దీంతో గ్రామస్థులు భయంతో గజగజలాడుతున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే గుట్టల వద్దకు చేరుకుని గాలింపు చర్యలు ప్రారంభించారు. ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు గ్రామస్థులకు సూచించారు.


