News February 11, 2025
HYD: అలవాట్ల మార్పుతో క్యాన్సర్: MNJ డాక్టర్

అలవాట్ల మార్పుతో క్యాన్సర్ల ప్రభావం రోజు రోజుకు పెరుగుతోంది. తంబాకు, గుట్కా, పాన్ మసాలా, జంక్ ఫుడ్ పలు సమస్యలు కారణంగా మారుతోంది. వ్యాధిని తొలి దశలో గుర్తిస్తే 90% నియంత్రించవచ్చని, ముఖ్యంగా జంక్ ఫుడ్స్, పర్యావరణ కాలుష్యం, రసాయన మందులతో పండించిన ఆహార పదార్థాల ద్వారా ముప్పు పెరుగుతున్నట్లు HYD MNJ క్యాన్సర్ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు.
Similar News
News March 23, 2025
దుబ్బాక: సైబర్ మోసానికి గృహిణి బలి

ఇంటి దగ్గర పార్ట్ టైం జాబ్ పేరుతో గృహిణి సైబర్ మోసానికి గురైన ఘటన దుబ్బాక పట్టణంలో ఇటీవల జరగగా, శనివారం కేసు నమోదు చేసినట్లు దుబ్బాక ఎస్ఐ గంగరాజు తెలిపారు. పోలీసుల వివరాలు.. డిసెంబర్ 29న తన ఇన్స్టాలో పార్ట్ టైం జాబ్ పేరుతో వచ్చిన ఓ లింకును ఓపెన్ చేసింది. విడతల వారీగా ఆమె రూ.59 వేలు వారి ఖాతాలకు పంపింది. మరికొంత డబ్బును పంపాలని సైబర్ నేరగాళ్లు కోరడంతో శనివారం దుబ్బాక పోలీసులను ఆశ్రయించింది.
News March 23, 2025
పరిగి: పది పరీక్ష రాస్తూ కళ్లు తిరిగి పడిన విద్యార్థి

దోమ మండలం ఊట్పల్లి గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి రిషిక పరిగి మున్సిపల్లోని జిల్లా పరిషత్ నంబర్-టు పాఠశాలలో హిందీ పరీక్ష రాస్తోంది. ఈ క్రమంలో కళ్లు తిరిగి పడిపోయింది. గమనించిన ఉపాధ్యాయులు, సిబ్బంది ఆసుపత్రికి తరలించి చికిత్స అందించి తిరిగి పరీక్ష రాయించారు.
News March 23, 2025
NZB: చెల్లి మృతి.. బాధలోనూ పరీక్ష రాసిన అన్న

ఓ వైపు చెల్లి మరణం.. మరో వైపు ‘పది’ పరీక్షలు. ఆ పుట్టెడు దుఃఖంలో పరీక్ష రాశారు నిజామాబాద్కు చెందిన లక్ష్మీ గణ సాయి. ఆదర్శనగర్లోని పానుగంటి సాయిలు-వినోద దంపతులకు కుమారుడు లక్ష్మీ గణ సాయి, కుమార్తె పల్లవి సంతానం. అయితే పల్లవి 2 నెలల క్రితం క్యాన్సర్ బారినపడి శుక్రవారం రాత్రి మరణించగా, ఆ వార్త దిగమింగుకొని అన్న శనివారం పదో తరగతి పరీక్ష రాశారు. దుఃఖంలోనూ పరీక్ష రాసిన అన్న గ్రేట్ కదా..!