News February 10, 2025
HYD: అలా చేస్తే.. మీ భరతం పడతాం: హైడ్రా

HYD నగరం సహా, ORR వరకు అనుమతులు లేకుండా రోడ్లపై, రోడ్లకు ఇరుపక్కలా ప్రకటన బోర్డులు ఏర్పాటు చేస్తే వారి భరతం పడతామని హైడ్రా హెచ్చరించింది. ఇటీవల శంషాబాద్లో భారీ హోర్డింగ్ తొలగించినట్లు దీనికి ఉదహరించింది. ఎక్కడైనా ప్రమాదకరమైన హోర్డింగులు ఉంటే తమ దృష్టికి తేవాలని హైడ్రా కోరింది. ఎక్కడికక్కడ కఠిన చర్యలు అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చింది.
Similar News
News November 28, 2025
అమ్మకానికి రెండు IPL జట్లు: హర్ష్ గోయెంకా

ఒకటి కాదు రెండు ఐపీఎల్ జట్లు అమ్మకానికి వచ్చే అవకాశం ఉందని ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా పేర్కొన్నారు. ‘ఆర్సీబీ మాత్రమే కాకుండా రాజస్థాన్ రాయల్స్ జట్టు కూడా అమ్మకానికి వస్తుందని నేను విన్నాను. వీటిని కొనుగోలు చేసేందుకు నలుగురు.. ఐదుగురు బయ్యర్స్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. పుణే, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, USA ఎవరు సక్సెస్ అవుతారో చూడాలి’ అని ట్వీట్ చేశారు.
News November 28, 2025
సిద్దిపేట: ఒకే మండలం నుంచి నలుగురు ఏకగ్రీవం

సిద్దిపేట జిల్లాలో నలుగురు సర్పంచ్ పదవులకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జగదేవపూర్ మం. బీజీ వెంకటాపూర్లో పరమేశ్వర్, మాందాపూర్లో ముత్యం, పలుగుగడ్డ నర్ర కనకయ్య, అనంతసాగర్లో కుమార్ను గ్రామాల అభివృద్ధి దృష్ట్యా గ్రామస్థులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నలుగురు బీసీ రిజర్వేషన్ కింద కేటాయించిన అభ్యర్థులే కావటం విశేషం. అయితే వారంతా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన సర్పంచులవటం మరో విశేషంగా చెప్పుకోవచ్చు.
News November 28, 2025
మచిలీపట్నం: మళ్లీ సేమ్ సీన్ రిపీట్..?

కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర కావొస్తుంది. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, మంత్రి రవీంద్ర కలిసి ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి కూడా శంకుస్థాపన చేయలేదు. ఒకట్రెండు సార్లు ప్రెస్మీట్లలో కలిసి పాల్గొన్నారు. ఇద్దరు నేతల మధ్య సమన్వయ లోపంతో ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతోందనే విమర్శలు వస్తున్నాయి. కాగా గతంలోనూ మాజీ మంత్రి పేర్నినాని, ఎంపీ బాలశౌరికి అంతర్గత విభేదాలతో ఇదే పరిస్థితి ఉండటం గమనార్హం.


