News April 16, 2025

HYD: అవయవ మార్పిడి.. 3,823 మంది వెయిటింగ్

image

అవయవ మార్పిడి కోసం ‘జీవన్ దాన్’ వద్ద 3,823 మంది నమోదు చేసుకున్నారని దాని నోడల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీభూషణ్ రాజు తెలిపారు. NIMS, ఉస్మానియా, గాంధీ, ESI ఆస్పత్రులతో పాటు HYDలోని 41 ఆస్పత్రుల్లో అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు చేస్తారన్నారు. అత్యధికంగా NIMSలో 620కి పైగా శస్త్ర చికిత్సలు నిర్వహించినట్లు తెలిపారు. అవయవదానం మరొకరికి పునర్జన్మలాంటిదని అభివర్ణించారు.

Similar News

News November 22, 2025

ఈ ఫుడ్స్‌తో విటమిన్ D3 లోపాలకు చెక్

image

ఎముకలను బలంగా ఉంచడం, రోగనిరోధకశక్తి పెంచడం, అలసటను తగ్గించడం, మానసిక స్థితిని మెరుగుపరచడంలో విటమిన్ D3 ముఖ్యపాత్ర పోషిస్తుంది. చేపలు, గుడ్డులోని పచ్చసొన, పాల ఉత్పత్తులు, పుట్టగొడుగులు, జున్ను, వెన్న, నెయ్యి తీసుకుంటే విటమిన్ D3 లోపానికి చెక్ పెట్టేయొచ్చు. సోయా, నారింజ రసం, తృణధాన్యాలలోనూ ఇది లభిస్తుంది. ఈ విటమిన్ పొందడానికి శరీరానికి సూర్యరశ్మి తగిలేలా జాగ్రత్తలు తీసుకోవడం సులభమైన మార్గం.

News November 22, 2025

ములుగు: అడవుల జిల్లా నుంచి ఇద్దరు సీబీఐ డైరెక్టర్లు..!

image

అడవుల జిల్లాగా పేరుపొందిన ములుగు ప్రాంతం నుంచి కేంద్ర ప్రభుత్వంలో అత్యంత కీలక అధికారులుగా ఇద్దరు పని చేశారన్న విషయం చాలామందికి తెలియదు. జాతీయ దర్యాప్తు సంస్థల్లో ప్రధానమైన సీబీఐకి చీఫ్‌లుగా ఏటూరునాగారానికి చెందిన కాకులమర్రి విజయరామారావు, మంగపేట మండలానికి చెందిన మన్నెం నాగేశ్వర్ రావు సేవలందించారు. విజయరామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో మంత్రిగా కూడా పనిచేశారు.

News November 22, 2025

పాలకుర్తి: ఫ్లెక్సీలో ఫొటోలు.. ఎమ్మెల్యేపై కాంగ్రెస్ శ్రేణుల ఆగ్రహం

image

పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డిపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. నేడు తొర్రూరులో నిర్వహించిన బ్రిడ్జిల శంకుస్థాపన కార్యక్రమానికి ఎంపీ కడియం కావ్య, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వచ్చారు. ఈక్రమంలో తమ అనుమతి లేకుండా ఫ్లెక్సీల్లో ఫోటోలు పెట్టారంటూ పలువురు కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. దీంతో మండల నాయకుల తీరుపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో వర్గ పోరు కొనసాగుతోందనే చర్చ జరుగుతోంది.