News March 12, 2025

HYD: అసెంబ్లీ పరిసరాల్లో భారీ భద్రత

image

తెలంగాణ అసెంబ్లీలో నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. బషీర్‌బాగ్, నాంపల్లి, రవీంద్రభారతి పరిసరాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నారు. నిరసనలు, ర్యాలీలు, ధర్నాలకు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు. బుధవారం ఉదయం 11 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రగతిపై గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించనున్నారు.

Similar News

News November 14, 2025

Jubilee Hills Counting: రౌండ్లు.. డివిజన్ల వివరాలు

image

రౌండ్.1: షేక్‌పేటలోని 42 బూత్‌లు
రౌండ్.2:షేక్‌పేట, ఎర్రగడ్డ, వెంగళరావునగర్-42బూత్‌లు
రౌండ్.3:ఎర్రగడ్డ, వెంగళరావునగర్, రహమత్‌నగర్-42బూత్‌లు
రౌండ్.4&5:రహమత్‌నగర్, వెంగళరావునగర్-84 బూత్‌లు
రౌండ్.6&7:వెంగళరావునగర్, యూసుఫ్‌గూడ, సోమాజిగూడ-84 బూత్‌లు
రౌండ్.8&9:సోమాజిగూడ, ఎర్రగడ్డ, బోరబండ-84 బూత్‌లు
రౌండ్.10: ఎర్రగడ్డలోని 29 బూత్‌ల లెక్కింపు జరగనుంది.

News November 14, 2025

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్న నవీన్ యాదవ్

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలోని కౌంటింగ్‌ హాల్‌కు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ చేరుకున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత, లంకల దీపక్ రెడ్డి కౌంటింగ్ సెంటర్‌లో ఉన్నారు. మరికాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. మరో రెండు గంటల్లోపు గెలుపు ఎవరిది? అనేది ఓ క్లారిటీ రానుందని టాక్.

News November 14, 2025

జూబ్లీహిల్స్: సుమారు 75 శాతం పోలింగ్ నమోదైన బూత్‌లు నాలుగే!

image

జూబ్లీహిల్స్ బైపోల్ పోలింగ్ మొత్తం 407 బూత్‌లల్లో జరిగింది. కాగా ఇందులో 20-30 శాతం పోలింగ్ నమోదైన కేంద్రం 1 కాగా 71 కేంద్రాల్లో 31-40%, 143 కేంద్రాల్లో 41-50%, 158 కేంద్రాల్లో 51-60%, 30 కేంద్రాల్లో 61-70%, 4కేంద్రాల్లో 71-75% పోలింగ్ నమోదైంది. అయితే 60 శాతం కంటే ఎక్కువ పోలింగ్ నమోదైన 34కేంద్రాల్లో రహమత్‌నగర్ 16, బోరబండ 13, షేక్‌పేట్ 2, ఎర్రగడ్డ 3 ఉన్నాయి. వీటిల్లో 18చోట్ల మహిళలే అధికంగా ఓటేశారు.