News November 28, 2024
HYD: ఆకర్షణ 18వ లైబ్రరీని ఓపెన్ చేసిన రాష్ట్ర గవర్నర్

8వ క్లాస్ స్టూడెంట్ ఆకర్షణ(13) అనాథాశ్రమాలు, పాఠశాలల్లో లైబ్రరీలను ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ర్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. మూసాపేటలోని సాయి సేవా సంఘం అనాథ పిల్లల ఆశ్రమంలో ఆకర్షణ 18వ లైబ్రరీని గవర్నర్ ప్రారంభించారు. పలు పుస్తకాలను విద్యార్థులకు అందచేశారు. పాకెట్ మనీతో పాటు తాను సేకరించిన పుస్తకాలతో లైబ్రరీలు ఏర్పాటు చేస్తున్న ఆకర్షణ నేటి తరం స్టూడెంట్స్కు ఆదర్శమన్నారు.
Similar News
News November 13, 2025
HYD: గెట్ రెడీ.. రేపే కౌంటింగ్

రేపు యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభంకానుంది. సెగ్మెంట్లో 4,01,365 ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,94,631(48.49%) మాత్రమే ఓటు వేశారు. 10 రౌండ్లు, 42 టేబుళ్ల మీద కౌంటింగ్ ఉంటుంది. షేక్పేటలోని 1వ బూత్తో మొదలై ఎర్రగడ్డలోని 407 బూత్తో కౌంటింగ్ ముగియనుంది. సీసీ కెమెరాల నిఘాలో ఈ ప్రక్రియ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల లోపు జూబ్లీహిల్స్ MLA ఎవరో తేలనుంది.
News November 13, 2025
HYD: నేడే ఫీజు చెల్లింపులకు లాస్ట్..!

HYD డా.బీ.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2019- 2024 మధ్య చేరిన డిగ్రీ 1st, 3rd ఇయర్ విద్యార్థులు ఇంకా ట్యూషన్ ఫీజు చెల్లించని వారు NOV 13లోపు చెల్లించొచ్చని విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డా.వై.వెంకటేశ్వర్లు తెలిపారు. అలాగే 2022- 2024 మధ్య MA, MCom, MSc అడ్మిషన్ పొందిన వారూ 2nd ఇయర్ ట్యూషన్ ఫీజు చెల్లించొచ్చని వివరించారు. పూర్తి వివరాలకు www.braouonline.inను సందర్శించండి.
News November 13, 2025
అధికారికంగా జూబ్లీహిల్స్లో 48.49% ఓటింగ్

జూబ్లీహల్స్ బైపోల్ వివరాలు అధికారికంగా వెల్లిడించారు. మొత్తం 4,01,365 మంది ఓటర్లలో పురుషులు 2,08,561 మంది ఉండగావారిలో 99,771 మంది, మహిళలు 1,92,779 మంది ఉండగా 94,855 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇతరులు 25 మంది ఉండగా ఐదుగురు ఓటింగ్లో పాల్గొన్నారు. మొత్తంగా 1,94,631 మంది ఓటేశారని అధికారికంగా గణాకాంలు ఇవాళ విడుదల అయ్యాయి. 48.49%తో అతి తక్కువ ఓటింగ్ మనవద్దే నమోదు కావడం గమనార్హం.


