News July 13, 2024

HYD: ఆగస్టు 6న ఛలో పార్లమెంట్: ఆర్.కృష్ణయ్య 

image

పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో 50% రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 6న ఛలో పార్లమెంట్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య తెలిపారు. శనివారం HYD బషీర్‌బాగ్‌లో ఆయన మాట్లాడుతూ.. ఈ దేశంలోనే బీసీలకు అన్యాయం జరుగుతోందని, ప్రపంచంలో ఏ దేశంలో కూడా మెజార్టీ ప్రజలను అణచి వేయడం లేదని, పేరుకే ప్రజాస్వామ్యం అని, ఆచరణలో మచ్చుకైనా లేదన్నారు.

Similar News

News November 2, 2025

BREAKING: HYD: నవీన్ యాదవ్‌పై కేసు నమోదు

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. BRS పార్టీ కేడర్‌ను లేకుండా చేస్తానంటూ ఆయన బెదిరింపులకు పాల్పడిన నేపథ్యంలో ఈ కేసు నమోదైంది. నవీన్ యాదవ్ సోదరుడు వెంకట్ యాదవ్ పై కూడా కేసు నమోదైంది. BRS కార్యకర్తల నుంచి బూత్ పేపర్లను లాక్కొని, వారిని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల అధికారుల ఫిర్యాదు మేరకు బోరబండ పోలీసులు వీరిపై మొత్తం 3 కేసులు నమోదు చేశారు.

News November 2, 2025

HYD: TRPలో చేరికలు

image

తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP)లో సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు ఈరోజు చేరారు. అడ్డగుట్ట మహేశ్ గౌడ్ ఆధ్వర్యంలో వివిధ పార్టీల నాయకులు TRPలో చేరారు. పార్టీ అధ్యక్షుడు, MLC తీన్మార్ మల్లన్న, రాష్ట్ర కార్యదర్శి భావన రఘు సమక్షంలో వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త నిబద్ధత, అంకితభావంతో కృషి చేయాలని మల్లన్న కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

News November 2, 2025

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 46% పనులు పూర్తి: కిషన్ రెడ్డి

image

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రపంచ స్థాయి సౌకర్యాలతో రూపుదిద్దుకుంటోంది. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ఈ స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. మొత్తం రూ.714.73 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఇప్పటి వరకు 46 శాతం పనులు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం ‘X’ వేదికగా వెల్లడించారు.