News July 13, 2024
HYD: ఆగస్టు 6న ఛలో పార్లమెంట్: ఆర్.కృష్ణయ్య

పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో 50% రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 6న ఛలో పార్లమెంట్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య తెలిపారు. శనివారం HYD బషీర్బాగ్లో ఆయన మాట్లాడుతూ.. ఈ దేశంలోనే బీసీలకు అన్యాయం జరుగుతోందని, ప్రపంచంలో ఏ దేశంలో కూడా మెజార్టీ ప్రజలను అణచి వేయడం లేదని, పేరుకే ప్రజాస్వామ్యం అని, ఆచరణలో మచ్చుకైనా లేదన్నారు.
Similar News
News February 12, 2025
లావణ్యతో నార్సింగి డీఐ శ్రీనివాస్ వీడియో కాల్స్..!

నార్సింగ్ డీఐ శ్రీనివాస్ను ఐజీ ఆఫీసుకు అటాచ్ చేస్తూ సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఆదేశాలు జారీచేశారు. రాజ్తరుణ్పై ఫిర్యాదు చేసినప్పటి నుంచి లావణ్యతో తరచూ వాట్సాప్లో వీడియో కాల్స్ మాట్లాడుతూ.. పరిచయం పెంచుకోవడం వీరిద్దరి ఆడియో కాల్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విచారణ జరిపిన ఉన్నతాధికారులు ఆయనపై చర్యలు తీసుకున్నారు.
News February 12, 2025
హైదరాబాద్లో 99 తపాలా పోస్టులు

పోస్టల్ శాఖలో 31 GDS, 68 డాక్ సేవక్ పోస్టులకు తపాలా శాఖలో నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్ అర్హతతో కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయసు 18-40ఏళ్ల మధ్య ఉండాలి. సైకిల్, బైక్ నడపగలగాలి. టెన్త్లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3వరకు ఈ https://indiapostgdsonline.gov.in/ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. #SHARE IT
News February 12, 2025
HYD: నేడు సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నేడు పంచాయతీరాజ్ శాఖ అధికారులతో కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, సీఎస్ శాంతి కుమారి, ఆ శాఖ కార్యదర్శి లోకేశ్కుమార్, ఇతర శాఖల మంత్రులు, అధికారులు హాజరుకానున్నారు. ప్రభుత్వంవైపు నుంచి స్థానిక ఎన్నికల కోసం చేసిన, చేయాల్సిన ఏర్పాట్లు, డెడికేటెడ్ కమిషన్ నివేదికపై చర్చించనున్నారు.