News December 12, 2024

HYD: ఆన్‌లైన్‌ గేమింగ్.. బీ కేర్‌ ఫుల్!

image

ఆన్‌లైన్‌ గేమింగ్ ప్రమాదకరమని‌ HYD సైబర్ క్రైమ్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు. తాజాగా ‘X’లో పోస్ట్‌ చేశారు.
‘ఆన్‌లైన్‌ గేమింగ్ యాప్స్‌ ద్వారా మాల్‌వేర్‌తో డేటాచోరీ అవుతుంది. గేమింగ్ పేరిట బ్యాంక్‌ అకౌంట్ల వివరాలు సేకరిస్తారు. మీకు తెలియకుండానే అకౌంట్‌ నుంచి డబ్బు విత్‌ డ్రా అవుతుంది. APK ఫైల్స్, థర్డ్ పార్టీ యాప్స్ ఇన్‌స్టాల్ చేయొద్దు.’ అని పోలీసులు సూచించారు.
SHARE IT

Similar News

News January 13, 2025

HYD: కాస్త ఆగండి.. 4 నెలల్లో సమస్యలు తీరతాయి

image

HYD దుర్గంచెరువు FTL వివాదాలకు 4 నెలల్లో శాశ్వ‌త‌ ప‌రిష్కారం చూపుతామ‌ని లేక్ ప్రొటెక్ష‌న్ క‌మిటీ ఛైర్మెన్‌, హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్‌ తెలిపారు. HYD రాయదుర్గం చెరువు FTL నిర్ధార‌ణ‌లో సంబంధిత ప్ర‌భుత్వ శాఖ‌ల‌తో పాటు, ఐఐటీ, బిట్స్‌పిలానీ, జేఎన్‌టీయూ వంటి విద్యా సంస్థ‌ల ఇంజినీర్ల‌ను కూడా భాగ‌స్వామ్యం చేస్తామ‌న్నారు. వాస్త‌వానికి 65.12 ఎక‌రాలు కాగా, ఒక్కో శాఖ ఒక్కో లెక్క చెబుతోంద‌ని స్థానికులన్నారు.

News January 13, 2025

రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న చలి తీవ్రత

image

రంగారెడ్డి జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో చందనవెల్లిలో 13.8℃, రెడ్డిపల్లె, తాళ్లపల్లి 14.2, కాసులాబాద్ 14.3, ఎలిమినేడు, రాచులూరు 14.4, షాబాద్ 14.5, రాజేంద్రనగర్, మీర్‌ఖాన్‌పేట 14.6, ఇబ్రహీంపట్నం వైట్‌గోల్డ్ ప్రాంతం, మంగళపల్లె 14.9, అమీర్‌పేట, కేతిరెడ్డిపల్లిలో 15℃ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ఈ ప్రాంతాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News January 13, 2025

HYD: నుమాయిష్‌కు ఇప్పటివరకు 2.75 లక్షల మంది

image

HYDలో జరుగుతున్న 84వ అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శనశాల నుమాయిష్‌కు ఆదివారం సందర్శకులు భారీగా తరలివచ్చినట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు నిరంజన్ తెలిపారు. దాదాపు 75 వేల మంది సందర్శించారని పేర్కొన్నారు. 80 సీసీ కెమెరాలతో ఎగ్జిబిషన్‌లో నిఘాను ముమ్మరం చేసినట్లు అబిడ్స్ ఏసీపీ చంద్రశేఖర్, సీఐ విజయ్ కుమార్ తెలిపారు. ఇప్పటివరకు 2.75 లక్షల మంది ఎగ్జిబిషన్‌కు వచ్చినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.