News October 8, 2024

HYD: ఆర్టిజన్‌ కార్మికులను రెగ్యులర్‌ చేయాలి: కూనంనేని

image

తెలంగాణలో విద్యుత్‌ రంగంలో పనిచేస్తున్న ఆర్టిజన్‌ కార్మికులు సుమారు 19వేల మంది చాలీచాలని జీతాలతో వెట్టిచాకిరి చేస్తూ కాలం వెల్లదీస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఈ సందర్భంగా నారాయణగూడలో ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ రంగ ఆర్టిజన్ కార్మికులనూ రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Similar News

News November 18, 2025

HYD: వాట్సాప్ మెసేజ్ తోనే రవిని పట్టుకున్నాం: DCP

image

iBOMMA రవి అరెస్ట్‌పై DCP కవిత కీలక ప్రకటన చేశారు. ‘iBOMMA రవికి అతడి కుటుంబసభ్యులతో పరిచయాలు లేవు. ఈ క్రమంలోనే HYDలో ఉన్న అతడి స్నేహితుడి గురించి సమాచారం రావడంతో మా టీమ్ అతడి కోసం వెళ్లింది. అదే సమయంలో అతడి ఫోన్‌కు రవి నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. తాను HYDకు వచ్చినట్లు రవి మెసేజ్ చేశాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్నాం. ఆ తర్వాతే అతడికి ఫ్యామిలీ ఉందని తెలిసింది’ అన్నారు.

News November 18, 2025

HYD: వాట్సాప్ మెసేజ్ తోనే రవిని పట్టుకున్నాం: DCP

image

iBOMMA రవి అరెస్ట్‌పై DCP కవిత కీలక ప్రకటన చేశారు. ‘iBOMMA రవికి అతడి కుటుంబసభ్యులతో పరిచయాలు లేవు. ఈ క్రమంలోనే HYDలో ఉన్న అతడి స్నేహితుడి గురించి సమాచారం రావడంతో మా టీమ్ అతడి కోసం వెళ్లింది. అదే సమయంలో అతడి ఫోన్‌కు రవి నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. తాను HYDకు వచ్చినట్లు రవి మెసేజ్ చేశాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్నాం. ఆ తర్వాతే అతడికి ఫ్యామిలీ ఉందని తెలిసింది’ అన్నారు.

News November 18, 2025

శంషాబాద్‌లో ర్యాగింగ్ కలకలం 2 వర్గాలుగా మారి గొడవ

image

శంషాబాద్‌లోని మీటా మైండ్ అకాడమీ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ర్యాగింగ్ ఘటనతో ఉద్రిక్తత నెలకొంది. 2nd ఇయర్ విద్యార్థులు 1st ఇయర్ విద్యార్థులపై ర్యాగింగ్‌కు పాల్పడటంతో ఘర్షణ చెలరేగింది. ఇరువర్గాల విద్యార్థులు పరస్పరం దాడులు చేసుకోవడంతో పలువురు గాయపడ్డారు. హాస్టల్ విద్యార్థులపై డేస్కాలర్ విద్యార్థులు స్థానిక గ్యాంగ్‌ సహాయంతో దాడి చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు రావడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.