News February 19, 2025
HYD: ఆర్థిక సమస్యలే అసలు కారణం..!

స్టేట్ ఆఫ్ వెల్ బీయింగ్-24 నివేదిక ఆర్థిక సమస్యలే ఆత్మహత్యలకు 70% కారణమని తెలిపింది. HYD సహ అనేక నగరాల్లో 2023తో పోలిస్తే 2024 చివరి నాటికి కార్పొరేట్ రంగంలో పనిచేస్తున్న వారికి 15 శాతం మానసిక సమస్యలు పెరిగినట్లుగా గుర్తించింది. నిరాశ, ఆందోళన, ఒత్తిడి సమస్యలతో ఉద్యోగులు సతమతపడుతున్నట్లు తెలిపింది. ఆర్థిక, రిలేషన్ షిప్ సమస్యలు ఉద్యోగుల కుటుంబాల్లో కలహాలు రేపుతున్నాయని TCN సర్వే తెలిపింది.
Similar News
News December 20, 2025
ముందస్తు అనుమతి ఉంటేనే న్యూఇయర్ వేడుకలు: పోలీసులు

TG: న్యూఇయర్ వేడుకలకు ముందస్తు అనుమతులు తప్పనిసరని హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే చెప్పారు. ఈవెంట్కు ఎంత మంది వస్తున్నారు? ఎన్ని టికెట్లు అమ్ముతున్నారో ముందే సమాచారమివ్వాలని ఇప్పటికే నిర్వాహకులను ఆదేశించినట్లు తెలిపారు. అటు మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏవైనా ప్రమాదాలు జరిగితే బాధ్యత ఈవెంట్ నిర్వాహకులదేనని చెప్పారు.
News December 20, 2025
కరీంనగర్: రూ.253.56 కోట్ల మందు తాగేశారు

మూడు విడతల్లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో లిక్కర్ ఏరులై పారింది. మొదటి విడత నామినేషన్లు మొదలుకొని చివరి విడత రిజల్ట్ వరకు పల్లెలు మద్యం నిషాతో మత్తెక్కాయి. ఉమ్మడి KNRలో 2025 DEC 1-19 మధ్య కేవలం 19 రోజుల్లో రికార్డు స్థాయిలో రూ.253.56 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. KNR రూ.89.89 కోట్లు, PDPL రూ.58.30 కోట్లు, SRCL రూ.42.83 కోట్లు, JGTL రూ.62.54 కోట్ల మందు IML డిపో నుండి డిస్పాచ్ అయింది.
News December 20, 2025
సింగరాయకొండ: చెరువులో యువకుడి మృత దేహం లభ్యం

సింగరాయకొండ మండలం సోమరాజు పల్లి పరిధిలోని మర్రి చెరువులో శనివారం గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామస్థుల సాయంతో మృతదేహాన్ని వెలికి తీయించారు. చనిపోయిన వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్సై మహేంద్ర తెలిపారు. మృతిని వివరాలు తెలియాల్సి ఉంది.


