News June 11, 2024
HYD: ఆ ప్రచారం నమ్మకండి: బల్మూరి వెంకట్
పదేళ్లు KCR గడీల పాలన సాగిందని, రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాతే గడీల పాలనకు స్వస్తి పలికామని MLC బల్మూరి వెంకట్ అన్నారు. ఈరోజు HYDలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రజా పాలన వచ్చిందన్నారు. పింక్ మీడియా అసత్యపు ప్రచారం చేస్తోందని, కొత్త యూట్యూబ్ ఛానల్స్ పెట్టి నెలకు రూ.3 లక్షలు ఇస్తున్నారన్నారు. TSకు బదులు TGగా మార్చినందుకు రూ.4 వేల కోట్లు ఖర్చు అవుతాయనేది అబద్ధమన్నారు.
Similar News
News October 4, 2024
HYD: మౌలానా ఆజాద్ యూనివర్సిటీలో అడ్మిషన్స్
మౌలానా ఆజాద్ నేషనల్ యూనివర్సిటీలో సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. MA-Urdu,MA -Hindi,MA-English, BA,B com, సర్టిఫికెట్ కోర్సులు అందుబాటులో ఉన్నా యని చెప్పారు. వెబ్సైట్ http//manuadmission mion.samarth.edu.in దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 10 నవంబర్ 2024 వరకు అవకాశం ఉందని చెప్పారు.
News October 4, 2024
HYD: నేటి నుంచి పీసీసీ చీఫ్ జిల్లా పర్యటన
PCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ శుక్రవారం నుంచి జిల్లా పర్యటనలకు సిద్ధం అవుతున్నారు. ఆయన సొంత జిల్లా నిజామాబాద్ నుంచే పర్యటన ప్రారంభించనున్న నేపథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ నార్సింగిలోని తన ఇంటి నుంచి నిజామాబాద్ బయలుదేరుతారు. ఆయన వెంట ఎనిమిది మంది మంత్రులు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పీసీసీ సీనియర్ నేతలు ఉంటారని తెలిపారు.
News October 4, 2024
HYD: KTR.. SORRY చెప్పాలి: శ్రీనివాస్
మాజీ మంత్రి KTR వెంటనే మంత్రి కొండా సురేఖకు సారీ చెప్పాలని TPCC ప్రధాన కార్యదర్శి చెకోలేకర్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. HYD బషీర్బాగ్ చౌరస్తాలో ఆయన మాట్లాడుతూ.. KTR తరచూ మహిళా ప్రజాప్రతినిధులను కించ పరుస్తున్నాడని మండిపడ్డారు. ఆయన తన BRS పార్టీ సోషల్ మీడియా ద్వారా కొండా సురేఖను ట్రోలింగ్ చేయిస్తున్నారని ఆరోపించారు. గతంలోనూ మంత్రి సీతక్కపై నోరు పారేసుకున్నారని ఫైర్ అయ్యారు.