News March 4, 2025
HYD: ఇంటర్ పరీక్షలు.. ఇది మీ కోసమే!

గ్రేటర్ హైదరాబాద్లో ఇంటర్ పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. హైదరాబాద్లో 244, రంగారెడ్డిలో 185, మేడ్చల్ మల్కాజిగిరిలో 150 కలిపి మొత్తం 579 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. మూడు జిల్లాల్లో 4,64,445 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. నగరంలోని అన్ని సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. విద్యార్థులకు ఏమైనా సందేహాలు ఉంటే 040-29700934కు కాల్ చేయండి.
SHARE IT
Similar News
News October 20, 2025
21న పోలీస్ అమరవీరుల సంస్మరణకు సీఎం రేవంత్: డీజీపీ

అక్టోబర్ 21 గోషామహల్ పోలీస్ స్టేడియంలో జరిగే పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమానికి రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి హాజరవనున్నారని డీజీపీ శివధర్ తెలిపారు. కార్యక్రమం ఉ.9.30 గంటలకు ప్రారంభమవుతుందని ఆయన ప్రకటించారు. అక్టోబర్ 21- 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
News October 20, 2025
HYD సెంట్రల్ జోన్ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్& డ్రైవ్ తనిఖీలు

హైదరాబాద్ సెంట్రల్ జోన్ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్& డ్రైవ్, సెల్ఫోన్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్ కేసులపై కఠిన చర్యలు చేపట్టారు. 212 మంది డ్రంక్& డ్రైవ్ నిందితులకు ₹6.79 లక్షల జరిమానా, 25 మందికి నాంపల్లి కోర్టు జైలుశిక్ష విధించింది. సెల్ఫోన్ డ్రైవింగ్పై ₹1.61 లక్షలు, మైనర్ డ్రైవింగ్పై ₹14,700 జరిమానా విధించారు. ట్రాఫిక్ భద్రతకు ప్రజలు కట్టుబడి ఉండాలని పోలీసులు సూచించారు.
News October 20, 2025
HYD: ట్రేడింగ్ మోసగాడు సుల్తాన్ అరెస్ట్

హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ మోసాల్లో పాల్గొన్న కందుకూరు సుల్తాన్ అహ్మద్ ఖాన్ను అరెస్ట్ చేశారు. ఈయన నకిలీ బ్యాంక్ ఖాతాలను కమిషన్ మీద అందించి దేశవ్యాప్తంగా సైబర్ మోసాలకు తోడ్పడ్డాడు. సుమారు ₹3 కోట్లు మోసం చేసినట్టు గుర్తించారు. దేశవ్యాప్తంగా 15కేసులు నమోదయ్యాయి. మొబైల్ ఫోన్లు, డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకుని బ్యాంక్ ఖాతాలను పరిశీలిస్తున్నారు.