News August 5, 2024
HYD: ‘ఇంటింటా ఇన్నోవేటర్’ గడువు పొడిగింపు

తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఇంటింటా ఇన్నోవేటర్-2024’ కార్యక్రమానికి సంబంధించి దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్లు సంస్థ అధికారులు తెలిపారు. ఎంట్రీలను సమర్పించేందుకు ఈనెల 10 వరకు గడువు పొడిగిస్తున్నట్లు చెప్పారు. సరికొత్త ఆవిష్కరణలు రూపొందించిన వారిని పరిచయం చేస్తూ వాటిని ఈనెల 15న ప్రదర్శిస్తామని వెల్లడించారు. వివరాలకు pr-tsic@telangana.gov.in వెబ్సైట్ చూడాలన్నారు.
Similar News
News October 21, 2025
అమరవీరుల స్తూపానికి సైబరాబాద్ సీపీ నివాళి

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు కొండాపూర్లో సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి అమరవీరుల స్మారకానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన 191 మంది పోలీసు సిబ్బందిని స్మరించారు. రక్తదాన శిబిరాలు, వ్యాసరచన పోటీలు, విద్యార్థుల కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ జోన్ డీసీపీలు, అధికారులు పాల్గొన్నారు.
News October 21, 2025
HYD: ఎన్నికల పరిశీలకులను నియమించిన ఎలక్షన్ కమిషన్

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల ప్రక్రియ ఈరోజు ముగియనుండగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఉప ఎన్నికను పరిశీలించేందుకు ముగ్గురు అధికారులను పరిశీలకులుగా నియమించింది. సాధారణ పరిశీలకులుగా ఐఏఎస్ అధికారి రంజిత్ కుమార్ సింగ్, పోలీస్ పరిశీలకులుగా ఓం ప్రకాశ్ త్రిపాఠి(IPS), ఇక వ్యయ పరిశీలకులుగా IRS అధికారి సంజీవ్ కుమార్ లాల్ నియమితులయ్యారు.
News October 21, 2025
BREAKING: జూబ్లీహిల్స్ స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్లో KCR

HYD జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి BRS పార్టీ స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించింది. ప్రచారంలో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత KCR పాల్గొననున్నట్లు వెల్లడించారు. ఆయనతో సహా పార్టీ తరఫున ప్రచారంలో 40 మంది ప్రముఖులు పాల్గొంటారు. మాజీ మంత్రులు KTR, హరీశ్రావు, శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉన్నారు.