News December 6, 2024
HYD: ఇంటింటికి కుష్టు వ్యాధి గుర్తింపు సర్వే

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 2నుంచి 15 వరకు 14 రోజుల పాటు ఇంటింటికి కుష్టు వ్యాధి గుర్తింపు సర్వే నిర్వహిస్తున్నట్లు గాంధీ UPHC IDH కాలనీ వైద్యాధికారి డా.ప్రశాంతి తెలిపారు. ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బందితో ఆమె సమావేశం నిర్వహించారు. 2027 కల్లా కుష్టురహిత భారతదేశ లక్ష్యంగా ప్రతి ఒక్కరు పని చేయాలని కోరారు. అనుమానిత మచ్చలు ఉంటే వైద్య సిబ్బందిని కలవాలన్నారు. వనిత, జ్యోతి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
Similar News
News November 23, 2025
GHMC: సీసీ రోడ్ల పెండింగ్.. ఈ 3 జోన్లలో అధికం

ఖైరతాబాద్ జోన్లో మొత్తం 506 పనులు పెండింగ్లో ఉన్నాయి. వీటి విలువ రూ.14,042.7 లక్షలు. 27 BT రోడ్ల పనుల్లో కేవలం 4 మాత్రమే పూర్తయ్యాయి!చార్మినార్ జోన్లో 728 పనులు పెండింగ్లో ఉన్నాయి. విలువ రూ.13,556.93 లక్షలు. ఇక్కడ కూడా CC పనుల బకాయి రూ.12,778.78 లక్షలుగా ఉంది. LBనగర్ జోన్లో రూ.11,446.4 లక్షల విలువైన 175 పనులు మిగిలి ఉన్నాయి. <<18363545>>ఈ మూడు జోన్లలో<<>>ని రోడ్ల సమస్యలపై ప్రజాగ్రహం తప్పేలా లేదు.
News November 23, 2025
నగరానికి CC శాపం.. బడ్జెట్కు భారం!

పెండింగ్ పనుల్లో సిమెంట్ కాంక్రీట్ (CC) రోడ్ల వాటా ఊహించని విధంగా ఉంది. ఈ కీలకమైన పనుల్లో జాప్యం వల్లే మొత్తం ఆర్థిక భారం పెరిగిపోయింది: 1,952 CC రోడ్ల పనులు పూర్తి కావాల్సి ఉంది. <<18363524>>వీటి అంచనా వ్యయం<<>> రూ.54,384.26 లక్షలు (సుమారు ₹543 కోట్లు). కేవలం 110 BT పనులకే రూ.6,419.91 లక్షలు పెండింగ్ ఉంది. మొత్తం రూ.608 కోట్ల పెండింగ్లో రూ.543 కోట్లు సీసీ రోడ్లకే కావడం గమనార్హం.
News November 22, 2025
తీవ్ర పోటీ: రంగారెడ్డి DCC పెండింగ్!

AICC కొత్తగా DCC ప్రెసిడెంట్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిని నియమించకపోవడం చర్చనీయాంశమైంది. RCపురానికి చెందిన దేప భాస్కర్ రెడ్డి, బడంగ్పేట మాజీ మేయర్ చిగురింత నర్సింహా రెడ్డి, చేవెళ్ల నుంచి భీంభరత్, ఎల్బీనగర్ నేత రాంమోహన్ గౌడ్, షాద్నగర్ నుంచి మాజీ MLA ప్రతాప్ రెడ్డి DCC ఆశించినట్లు తెలిసింది. పెండింగ్లో ఉంచడానికి తీవ్ర పోటీ ప్రధాన కారణమని సమాచారం.


