News April 16, 2025
HYD: ఇంటికి స్వచ్ఛ ఆటో రాలేదా..? ఫిర్యాదు చేయండి!

HYD నగరవ్యాప్తంగా స్వచ్ఛ ఆటో ప్రతి ఒక్కరి ఇంటి వద్దకు వచ్చి చెత్త సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉప్పల్, నాచారం, మల్లాపూర్ సహా అనేక ప్రాంతాల్లో గల్లీలో డే బై డే స్వచ్ఛ ఆటోలు వస్తున్నాయి. అయితే మీ ప్రాంతానికి ఒకవేళ స్వచ్ఛ ఆటో రాకపోతే 040-21111111కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.
Similar News
News September 18, 2025
వరంగల్: తుపాకీ పట్టారు.. తూటాకు బలయ్యారు..!

కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్తో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మావోయిస్టు అగ్రనేతలు నేలకొరుగుతున్నారు. ఛత్తీస్గఢ్ వరుస ఎన్కౌంటర్లతో అగ్ర నేతలు అమరులవుతున్నారు. ఇప్పటివరకు జనగామకు చెందిన గుమ్మడవెల్లి రేణుక, భూపాలపల్లికి చెందిన గాజర్ల రవి, వరంగల్కు చెందిన మోదెం బాలకృష్ణతో పాటు సుధాకర్, ఏసోలు, అన్నై సంతోశ్, సారయ్య, ఇలా ఒక్కొక్కరుగా ఉద్యమ బాటలో ఊపిరి వదులుతున్నారు.
News September 18, 2025
నేడు ప్రపంచ వెదురు దినోత్సవం

ఏ ప్రాంతమైనా, భూమి రకం ఎలాంటిదైనా సాగుకు అనుకూలమైన పంట వెదురు. తక్కువ పెట్టుబడితో నీటి వసతి నామమాత్రంగా ఉన్నా, ఎరువులు, పురుగు మందులతో పనిలేకుండా ఈ పంటను సాగు చేయవచ్చు. వంట చెరకుగా, వివిధ నిర్మాణాలు, ఫర్నిచర్, కళాకృతుల తయారీలో దీన్ని ఉపయోగిస్తున్నారు. వెదురు పంట రైతులకు ఆర్థికంగా చేయూతనిస్తూ, పర్యావరణానికీ ఎంతో మేలు చేస్తోంది. ఏటా సెప్టెంబర్-18న ప్రపంచ వెదురు దినోత్సవం నిర్వహిస్తున్నారు.
News September 18, 2025
జగిత్యాల నాయకులకు మన్ కీ బాత్ బాధ్యతలు

భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో జిల్లాల వారీగా మన్ కీ బాత్ కన్వీనర్లు, కో-కన్వీనర్లను నియమించింది. ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రజలకు చేరవేస్తున్న సందేశాలను ప్రతి జిల్లాలో ప్రసారం చేసి, గ్రామస్థాయికి చేర్చే బాధ్యత ఈ నియమిత నాయకులపై ఉండనుంది. JGTL నుంచి పిల్లి శ్రీనివాస్ కన్వీనర్గా, దొణికెల నవీన్ కో-కన్వీనర్గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు వీరికి శుభాకాంక్షలు తెలిపారు.