News February 12, 2025
HYD: ఇక వస్త్రాల క్వాలిటీ చెకింగ్ ఇక్కడే..!

వస్త్ర ఉత్పత్తుల నాణ్యతను పరిశీలించేందుకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(BIS) HYD మౌలాలిలో లాబరేటరీ ప్రారంభించింది. డైరెక్టర్ జనరల్ ప్రసాద్ కుమార్ తివారి మాట్లాడుతూ.. టెక్స్టైల్ రంగంలో నాణ్యత పరీక్షలను హైటెక్నాలజీ లేబోరేటరీ బలోపేతం చేస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జారీచేసిన క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్లను సరఫరా చేయడంలో ఈ ల్యాబ్ క్రీలకంగా పనిచేస్తుందన్నారు.
Similar News
News March 18, 2025
ములుగు: అనుమానస్పద స్థితిలో మహిళా మృతి..?

కాటాపూర్ గ్రామానికి చెందిన ఈశ్వరి అనే మహిళ సోమవారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అనుమానస్పద స్థితిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. మృతి చెందిన ఈశ్వరి పక్కింటి వారితో గొడవపడ్డారని.. అనంతరం ఆమె ఇంట్లో మృతిచెంది కనిపించిందని తెలిపారు. ఈశ్వరి ఒంటిపై గాయాలు ఉన్నాయని పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని హత్యనా.? ఆత్మహత్యనా.? అనే కోణంలో విచారిస్తున్నారు.
News March 18, 2025
వింత వ్యాధి.. సూర్యాపేట జిల్లాలో భయం.. భయం..!

సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ సహా వివిధ మండలాల్లో వీధి కుక్కలకు పది రోజులుగా వింత వ్యాధి సోకుతోందని స్థానికులు తెలిపారు. వాటి శరీరంపై పుండ్లు వ్యాపించి, నల్లరంగుతో కూడిన మచ్చలు ఏర్పడుతున్నాయన్నారు. ఓ కుక్క రెండు రోజుల క్రితం మూడేళ్ల బాలుడిని కరిచేందుకు వెంటాడింది. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారన్నారు. చిన్నారులకు ప్రాణహాని ఉందని, అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.
News March 18, 2025
MNCL: ఈ నంబర్లకు కాల్ చేయండి..!

ఏప్రిల్ 6న భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి వెళ్లలేని భక్తుల సౌకర్యార్థం లాజిస్టిక్ సేవ విభాగం ఆధ్వర్యంలో ఇంటి వద్దకే కళ్యాణ తలంబ్రాలు పంపిణీకి బుకింగ్ను సోమవారం మంచిర్యాల ఆర్టీసి డిపో మేనేజర్ జనార్దన్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. కళ్యాణం జరిగిన తర్వాత ముత్యాల తలంబ్రాలను పంపిణీ చేస్తామని తెలిపారు. అవసరమైన వారు 7382841860, 9866771482, 9154298541 నంబర్లలో సంప్రదించాలన్నారు.