News September 1, 2024
HYD: ఇద్దరు పిల్లలను చంపి దంపతుల ఆత్మహత్య

HYD జీడిమెట్ల పీఎస్ పరిధి గాజుల రామారంలో దారుణం జరిగింది. ఓ అపార్ట్మెంట్లో ఇద్దరు పిల్లలను చంపి భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు మంచిర్యాలకు చెందిన దంపతులు వెంకటేశ్(40), వర్షిణి(33), వారి పిల్లలు రిషికాంత్(11), విహంత్ (3)గా గుర్తించారు. ఘటనా స్థలానికి జీడిమెట్ల పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 12, 2025
ఢిల్లీ బాంబు బ్లాస్ట్.. HYDలో హై అలర్ట్

న్యూఢిల్లీ ఎర్రకోటలో బాంబ్ బ్లాస్ట్ దేశాన్ని వణికించింది. దీంతో మెయిన్ సిటీల్లో అధికారులు అలర్ట్ అయ్యారు. SCR పరిధిలో భద్రతా తనిఖీలు కఠినం చేశారు. RPF, GRP బాంబు డిఫ్యూజ్ బృందాలు, డాగ్ స్క్వాడ్లు సికింద్రాబాద్, HYD, కాచిగూడ వంటి ప్రధాన స్టేషన్లలో తనిఖీలు చేపట్టాయి. సీసీటీవీ నిఘా బలోపేతం చేసి, ప్రయాణీకులు అనుమానాస్పద వస్తువులు గమనిస్తే వెంటనే రైల్వే సిబ్బందికి తెలియజేయాలని అధికారులు సూచించారు.
News November 12, 2025
HYD: పెళ్లి చేసుకుందామంటే పిల్ల దొరకట్లే సారూ!

HYD, రంగారెడ్డి, మేడ్చల్లో ORR వరకు నిర్వహించిన సర్వేలో పెళ్లిపిల్ల కోసం అనేకులు దరఖాస్తులు చేసుకుంటున్నప్పటికీ, వధువు దొరకడం లేదని యంగ్ ఏజ్ మ్యారేజ్ సర్వే వెల్లడించింది. కాగా.. 3 ఏళ్లలో దాదాపు 45 శాతం మందికి అమ్మాయిలు దొరకక ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలిపారు. దీనికి ఉద్యోగం, సంపాదన, సొంతిళ్లు ఇలా పలు కారణాలు ఉన్నాయంది. ఓవైపు పిల్ల దొరకక, మరోవైపు వయసు మీద పడుతుంటే సింగిల్స్కు టెన్షన్ పెరుగుతోంది.
News November 12, 2025
HYD: డోర్లు మినహా.. మిగతా చోట్ల గ్రిల్స్ ఏర్పాటు!

ప్రమాదల నివారణకు మెట్రో మరో అడుగు ముందుకేసింది. అమీర్పేట ఎక్స్టెన్షన్ కావడంతో రద్దీ బీభత్సంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో L&T ఆధ్వర్యంలో ప్లాట్ ఫాం వద్ద స్పెషల్ డోర్లు కాకుండా, గ్రిల్స్ ఏర్పాటు చేస్తున్నారు. మెట్రో డోర్ ఓపెన్ అయ్యే ప్రాంతాన్ని ఖాళీగా ఉంచి, మిగిలిన ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.


