News September 26, 2024

HYD: ఇళ్లకు ‘RB-X’ మార్కింగ్..!

image

మూసీ నది ప్రక్షాళనలో భాగంగా <<14199043>>ఇళ్లు కోల్పోయే వారికి<<>> పునరావాసం కల్పించేందుకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా అధికారులు చర్యలు చేపట్టారు. అర్హులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇచ్చేందుకు రీ సర్వే చేస్తున్నారు. ఓనర్ల నుంచి ఇంటి పత్రాలు, ఇతర వివరాలు సేకరిస్తున్నారు. డిప్యూటీ కలెక్టర్ శివకుమార్, తహశీల్దార్లు సంధ్యారాణి, అహల్య ఆధ్వర్యంలో కూల్చివేసే ఇళ్లకు RB-X పేరిట మార్కింగ్ చేస్తున్నారు.

Similar News

News November 17, 2025

సౌదీ యాక్సిడెంట్: 18 మంది రాంనగర్ వాసులు మృతి!

image

సౌదీలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 18 మంది ముషీరాబాద్‌లోని రాంనగర్ వాసులు మృతి చెందారు. జమిస్తాన్‌పూర్ హై స్కూల్ వెనుక గల్లీలో ఉండే SK నసీరుద్దీన్ ఫ్యామిలీ ఉమ్రా యాత్రకు వెళ్లినట్లు ఆయన బంధువు అస్లాం Way2Newsకి తెలిపారు. మొత్తం కుటుంబంలో ఒక్కరు మాత్రమే మిగిలారని, అతడు ఈ టూర్‌కి వెళ్లనట్లు స్పష్టం చేశారు. ప్రాణాలతో ఉన్న ససీరుద్దీన్ కుమారుడు ఈ ప్రమాదం జరిగినప్పుడు USలో ఉన్నట్లు అస్లాం చెప్పారు.

News November 17, 2025

సౌదీ యాక్సిడెంట్: 18 మంది రాంనగర్ వాసులు మృతి!

image

సౌదీలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 18 మంది ముషీరాబాద్‌లోని రాంనగర్ వాసులు మృతి చెందారు. జమిస్తాన్‌పూర్ హై స్కూల్ వెనుక గల్లీలో ఉండే SK నసీరుద్దీన్ ఫ్యామిలీ ఉమ్రా యాత్రకు వెళ్లినట్లు ఆయన బంధువు అస్లాం Way2Newsకి తెలిపారు. మొత్తం కుటుంబంలో ఒక్కరు మాత్రమే మిగిలారని, అతడు ఈ టూర్‌కి వెళ్లనట్లు స్పష్టం చేశారు. ప్రాణాలతో ఉన్న ససీరుద్దీన్ కుమారుడు ఈ ప్రమాదం జరిగినప్పుడు USలో ఉన్నట్లు అస్లాం చెప్పారు.

News November 17, 2025

HYD పోలీసులకు పవన్ కళ్యాణ్ అభినందనలు

image

సినిమా పైరసీ ముఠాను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులకు, సిటీ కమిషనర్ సజ్జనార్‌కి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. డబ్బుల రూపంలోనే కాదు, సృజనాత్మకతను పెట్టుబడిగా పెట్టి నిర్మించే సినిమాలను విడుదలైన రోజునే ఇంటర్నెట్‌లో పోస్ట్ చేస్తున్న ముఠాలతో చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో పైరసీ ముఠా అరెస్ట్ శుభపరిణామన్నారు.