News April 15, 2025
HYD: ఈ మండలాల నుంచే అధిక దరఖాస్తులు

నగరంలో రాజీవ్ యువ వికాసం పథకం కోసం వచ్చిన దరఖాస్తుల్లో అధిక భాగం 3 మండలాల నుంచే వచ్చాయి. అసిఫ్నగర్, బహదూర్పుర, బండ్లగూడ నుంచి అధిక శాతం దరఖాస్తులు రాగా సైదాబాద్, ఖైరతాబాద్, చార్మినార్, నాంపల్లి నుంచి కూడా అప్లికేషన్లు వచ్చాయి. ఈ దరఖాస్తులను పరిశీలించిన తరువాత అర్హులెవరనేది అధికారులు నిర్ణయిస్తారు.
Similar News
News October 27, 2025
జూబ్లీ బైపోల్: కమలానికి టీడీపీ, జనసేన సహకారం?

ప్రస్తుతం ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం నడుస్తోంది. దీంతో కూటమిలోని ప్రధాన పార్టీలు టీడీపీ, జనసేనలు జూబ్లీహిల్స్ బై పోల్లో కమలానికి మద్దతునిస్తున్నట్లు సమాచారం. ఆ 2 పార్టీల నాయకులు అంతర్గతంగా బీజేపీకి ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ కమలం విజయం సాధిస్తే తమ వల్లే విజయం సాధించిందని చెప్పుకునేందుకు అవకాశముంటుందని ఇరుపార్టీల అధినేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
News October 27, 2025
HYD: సైనిక్ స్కూళ్లలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

2026-27 విద్యా సంవత్సరానికి 6, 9 తరగతులలో ప్రవేశాల కోసం NTA నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుల గడువు అక్టోబర్ 30తో ముగియనుంది. 10- 12 ఏళ్లు (6వ తరగతి), 13-15 ఏళ్లు (9వ తరగతి) మధ్య వయస్సు ఉన్న విద్యార్థులు www.aissee.nta.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు అవకాశం ఉంటుంది. ప్రవేశ పరీక్ష జనవరి రెండో వారంలో జరుగుతుంది.
News October 27, 2025
బల్కంపేట ఎల్లమ్మకి కార్తీక సోమవారం పూజలు

నగరంలో కార్తీక సోమవారం సందర్భంగా ప్రసిద్ధి చెందిన ఆలయాలలో భక్తులతో సందడి నెలకొంది. బల్కంపేట ఎల్లమ్మ క్షేత్రంలో వేకువ జామునుంచే అమ్మవారికి అభిషేకాలు చేశారు. పూలతో ప్రత్యేకంగా అలంకరించి అర్చనలు నిర్వహించారు. ఎల్లమ్మ పోచమ్మ తల్లి కరుణించవమ్మ అనే నామస్మరణతో ఆలయం మార్మోగింది. పంచ హారతుల కోసం భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. అమ్మవారి దర్శనానికి 30MIN పడుతోందని భక్తులు చెబుతున్నారు.


