News April 15, 2025
HYD: ఈ మండలాల నుంచే అధిక దరఖాస్తులు

నగరంలో రాజీవ్ యువ వికాసం పథకం కోసం వచ్చిన దరఖాస్తుల్లో అధిక భాగం 3 మండలాల నుంచే వచ్చాయి. అసిఫ్నగర్, బహదూర్పుర, బండ్లగూడ నుంచి అధిక శాతం దరఖాస్తులు రాగా సైదాబాద్, ఖైరతాబాద్, చార్మినార్, నాంపల్లి నుంచి కూడా అప్లికేషన్లు వచ్చాయి. ఈ దరఖాస్తులను పరిశీలించిన తరువాత అర్హులెవరనేది అధికారులు నిర్ణయిస్తారు.
Similar News
News December 2, 2025
GHMC: దీర్ఘకాలిక సేవల కోసం HMWSSB ప్రణాళికలు

GHMCలో శివారు మున్సిపాలిటీల విలీనంతో HMWSSB పరిధి కూడా పెరగనుంది. దీంతో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ తన సేవలు విస్తరించేందుకు సిద్ధమవుతోంది. జీహెచ్ఎంసీలో శివారు మున్సిపాలిటీల విలీనంతో తాగునీరు, సీవరేజ్, డ్రైనేజి లైన్ నిర్వహణ భారంగా మారనుంది. కొత్తగా లైన్ ఏర్పాటు చేయడంతో పాటు, పాతవాటికి కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. 2047 వరకు ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తోంది.
News December 2, 2025
HYD: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

కోవైట్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు వస్తున్న ఇండిగో (6e 1234) విమానానికి బాంబు బెదిరింపు మేయిల్ వచ్చింది. అర్దరాత్రి 1:30 నిమిషాలకు బయలుదేరిన విమానం ఉదయం 8:10 శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు విమానం చేరుకుంది. బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో విమానాన్ని ముంబై ఎయిర్ పోర్ట్కు దారి మళ్లించారు. ముంబయిలో ఇంకా ల్యాండింగ్ కానీ విమానం భయం గుప్పెట్లో ఫైలెట్ తోపాటు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.
News December 2, 2025
HYD: ప్రేమ జంట ఆత్మహత్య(UPDATE)

రంగారెడ్డి జిల్లా కొత్తూరులో <<18443763>>ప్రేమ జంట<<>> ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. కాగా, కొత్తూరు పట్టణంలో ఓ బేకరీ పరిశ్రమలో పనిచేస్తున్న అనామిక అదే కంపెనీలో బిహార్కు చెందిన ధనుంజయ్ను ప్రేమించింది. అనామిక పరిశ్రమకు వెళ్లకపోవడంతో ధనుంజయ్ ఆమెకు ఫోన్ చేసి ఇంటికి వచ్చాడు. తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదని మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించా


