News April 9, 2024

HYD: ‘ఉగాది’.. కల్పిస్తోంది ఉపాధి..!

image

శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పండగ నేపథ్యంలో కుమ్మరులు ఉపాధి పొందుతున్నారు. పండగ వేళ షడ్రుచులతో కూడిన పచ్చడిని మట్టి పాత్రల్లో తయారు చేసి స్వీకరించడం ఆనవాయితీగా వస్తోంది. పండగను దృష్టిలో పెట్టుకుని HYD, ఉమ్మడి RRలోని కుమ్మరులు నెల రోజుల నుంచే మట్టి పాత్రలను ప్రత్యేకంగా తయారు చేశారు. వారం రోజుల నుంచి ప్రధాన కూడళ్లలో విక్రయానికి ఉంచారు. పాత్ర పరిమాణాన్ని బట్టి రూ.80-రూ.120 వరకు విక్రయిస్తున్నారు.

Similar News

News September 17, 2025

HYDలో గోల్డ్ షాపు యజమానుల ఇళ్లలో ఐటీ సోదాలు

image

తెల్లవారుజామునుంచే HYDలోని ప్రముఖ గోల్డ్ షాపు యజమానుల ఇళ్లలో ఐటీ సోదాలు చేస్తోంది. ట్యాక్స్ చెల్లింపుల్లో అవకతవకల నేపథ్యంలో ఈ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 15 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. వరంగల్లోనూ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం.

News September 17, 2025

JNTUలో 198 ఎంటెక్ సీట్లకు స్పాట్ అడ్మిషన్లు

image

JNTU యూనివర్సిటీలో ఎంటెక్ విభాగానికి సంబంధించి స్పాన్సర్ క్యాటగిరీలో స్పాట్ అడ్మిషన్లకు అధికారుల సిద్ధమయ్యారు. ఈ నెల 18 నుంచి 20 వరకు యూనివర్సిటీతో పాటు అనుబంధ కళాశాలలో 198 సీట్లకు స్పాట్ అడ్మిషన్లను నిర్వహించనున్నట్లు అడ్మిషన్ డైరెక్టర్ బాలు నాయక్ తెలిపారు. ఉ.10 గంటల నుంచి సా.6 గంటల వరకు అడ్మిషన్లకు సంబంధించి ప్రక్రియ నిర్వహిస్తామని ఆయన అన్నారు.

News September 17, 2025

చర్లపల్లి రైల్వే స్టేషన్‌ వద్ద సంచిలో మహిళ డెడ్‌బాడీ

image

చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో ఓ మహిళ మృతదేహం కలకలం రేపింది. దుండగులు ఆమెను హత్య చేసి, సంచిలో కుక్కి ఆటో స్టాండ్ వద్ద పడేసి వెళ్లినట్లు తెలుస్తోంది. మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన రావడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు చేసి దర్యాప్తు చేపట్టారు.