News April 9, 2024

HYD: ‘ఉగాది’.. కల్పిస్తోంది ఉపాధి..!

image

శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పండగ నేపథ్యంలో కుమ్మరులు ఉపాధి పొందుతున్నారు. పండగ వేళ షడ్రుచులతో కూడిన పచ్చడిని మట్టి పాత్రల్లో తయారు చేసి స్వీకరించడం ఆనవాయితీగా వస్తోంది. పండగను దృష్టిలో పెట్టుకుని HYD, ఉమ్మడి RRలోని కుమ్మరులు నెల రోజుల నుంచే మట్టి పాత్రలను ప్రత్యేకంగా తయారు చేశారు. వారం రోజుల నుంచి ప్రధాన కూడళ్లలో విక్రయానికి ఉంచారు. పాత్ర పరిమాణాన్ని బట్టి రూ.80-రూ.120 వరకు విక్రయిస్తున్నారు.

Similar News

News November 8, 2025

హైదరాబాద్ మాజీ క్రికెటర్‌కు అరుదైన గౌవరం

image

మిథాలి రాజ్.. హైదరాబాదీ మాజీ క్రికెటర్.. మహిళా క్రికెట్‌లో ఎన్నో సంచలనాలు నమోదు చేసిన గొప్ప క్రీడాకారిణి. వివిధ మ్యాచ్‌లో గెలిపించి భారత క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక పేజీని లిఖించుకున్న బ్యాట్స్ ఉమెన్.. ఇప్పడు మిథాలికి అరుదైన గౌరవం దక్కింది. ఐసీసీలో జరిగిన సమావేశంలో మిథాలికి ఐసీసీ ఉమెన్ క్రికెట్ కమిటీలో చోటు కల్పించింది. దీంతో హైదరాబాద్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News November 8, 2025

జూబ్లీ బైపోల్: చనిపోయిన ఓటర్ల వివరాల సేకరణ

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఈసారి వివిధ పార్టీల కార్యకర్తలు మరణించిన ఓటర్ల వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఎంతమంది మరణించారు.. ఎంతమందికి ఇక్కడ ఓట్లు ఉన్నాయి అనే విషయాలు ఆరా తీస్తున్నారు. ఎందుకంటే పోలింగ్ రోజు ఎవరైనా మృతి చెందిన ఓటరు పేరున వచ్చి ఓటు వేసే ప్రమాదముండటంతో ముందుజాగ్రత్త చర్యగా.. పోలింగ్ కేంద్రంలో అడ్డుకునేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.

News November 8, 2025

సికింద్రాబాద్: బెర్తులు ఖాళీ.. బుక్ చేసుకోండి!

image

సిటీ నుంచి వెళ్లే పలు రైళ్లకు బెర్తులు ఖాళీగా ఉన్నాయి.. బుక్ చేసుకోండి అంటూ స్వయంగా రైల్వే అధికారులే చెబుతున్నారు. సికింద్రాబాద్ నుంచి అనకాపల్లి, చర్లపల్లి నుంచి దానాపూర్, విశాఖపట్టణం, కాకినాడ, ధర్మవరం, తిరుచానూరు, నర్సాపూర్, కాచిగూడ నుంచి తిరుచానూరుకు వెళ్లే రైళ్లల్లో బెర్తులు నేటి నుంచి 13 వరకు ఖాళీలున్నాయని CPRO శ్రీధర్ తెలిపారు. మరెందుకాలస్యం.. ప్రయాణాలుంటే బుక్ చేసుకోండి మరి.