News July 19, 2024

HYD: ఉజ్జయినీ బోనాలు.. కీలక మార్పులు

image

ఈనెల 21న నిర్వహించనున్న సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాలకు అధికారులు కీలక మార్పులు చేశారు. ఈసారి ఆలయంలోకి జోగినీలు, శివసత్తులతో పాటు ఐదుగురినే అనుమతిస్తామని స్పష్టం చేశారు. అలాగే మధ్యాహ్నం 1:30 నుంచి సా.4 గంటలలోపు బాట కూడలి నుంచి మాత్రమే వచ్చేలా పక్కా ప్రణాళిక చేశారు. బోనాల అనంతరం నిర్వహించే ఫలారం బండి(తొట్టెల) ఊరేగింపు రాత్రి 12 గంటల వరకు మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలిపారు.

Similar News

News November 29, 2025

HYD: కొడుకుతో కలిసి భర్తను చంపిన భార్య (UPDATE)

image

బోడుప్పల్‌లో భర్తను భార్య దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. స్థానికుల ప్రకారం.. అంజయ్య‌(55)కు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. నెల క్రితం కూతురి వివాహమైంది. పుట్టింట్లో ఉంది. గురువారం రాత్రి భార్య బుగమ్మ, కుమారుడు రాజు, బంధువు శేఖర్‌తో కలిసి అంజయ్య మద్యం తాగారు. అర్ధరాత్రి ముగ్గురు అతడి మెడకు చున్నీ బిగించి హతమార్చారు. కూతురు అడ్డుకోగా గదిలో బంధించారు. పోలీసులకు ఫిర్యాదుతో వెలుగులోకొచ్చింది.

News November 28, 2025

పెద్దన్న నుంచి ఇంకా పర్మిషన్ రాలేదు.. ప్చ్..!

image

పలు ప్రాజెక్టుల అనుమతి కోసం పంపిన ప్రతిపాదనలపై కేంద్రం ఇంకా స్పందించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం అసహనం వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా నగరం చుట్టూ నిర్మించనున్న రీజనల్ రింగ్ రోడ్, బందరు పోర్టు నుంచి నగరానికి నిర్మించనున్న ఎక్స్‌ప్రెస్ వే, హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారి, నగరం నుంచి విజయవాడకు 6 లేన్ల రోడ్డు పనులు, మెట్రో ఫేజ్- 2 పనులకు ఇంకా కేంద్ర ప్రభుత్వం ఇంకా ఆమోదం తెలపలేదు.

News November 28, 2025

పెద్దన్న నుంచి ఇంకా పర్మిషన్ రాలేదు.. ప్చ్..!

image

పలు ప్రాజెక్టుల అనుమతి కోసం పంపిన ప్రతిపాదనలపై కేంద్రం ఇంకా స్పందించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం అసహనం వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా నగరం చుట్టూ నిర్మించనున్న రీజనల్ రింగ్ రోడ్, బందరు పోర్టు నుంచి నగరానికి నిర్మించనున్న ఎక్స్‌ప్రెస్ వే, హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారి, నగరం నుంచి విజయవాడకు 6 లేన్ల రోడ్డు పనులు, మెట్రో ఫేజ్- 2 పనులకు ఇంకా కేంద్ర ప్రభుత్వం ఇంకా ఆమోదం తెలపలేదు.